Friday, July 9, 2010

టివి న్యూస్‌రీడర్లకూ నంది బహుమతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : తెలుగు వార్తా ఛానెళ్ళలో అందంగా, ఆకర్షణీయంగా వీక్షకులను ఆకట్టుకునే విధంగా వార్తలు చదివే న్యూస్‌రీడర్లను ప్రోత్సహించడం కోసం ఇకనుంచి ఉత్తమ టివీ న్యూస్‌రీడర్లకు నంది బహుమతులు అందజేయనున్నట్టు రాష్ట్ర చలనచిత్ర, టివీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి. పార్థసారథి తెలిపారు.
2009 నుంచి వివిధ ఉపగ్రహ తెలుగు టివీ ఛానెళ్ళలో వార్తలను ఉత్తమంగా అందించిన న్యూస్‌రీడర్లకు కాంస్య నంది బహుమతులను అందజేస్తారు. వివిధ ఉపగ్రహ ఛానెళ్ళలో ప్రసారమవుతున్న సీరియళ్ళు, టెలిఫిల్మ్‌లలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసే ప్రత్యేక కమిటియే ఈ న్యూస్‌రీడర్లను కూడా ఎంపిక చేస్తారు. 2009 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ టివీ సీరియళ్ళను, టెలిఫిల్మ్‌లను ఆహ్యానిస్తూ ఒక ప్రకటన జారీచేశారు.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment