Thursday, July 29, 2010

కెసీఆర్ నిర్వహణలోని రాజ్ ఛానల్ మూసివేతకు సిద్ధం?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు యాజమాన్యంలో నడుస్తున్న రాజ్ న్యూస్ టీవీ ఛానల్ కు కష్టాలు వచ్చిపడ్డాయి. నిర్వహణ వ్యయం అధికంగా ఉండడం, రేటింగ్ దాదాపు లేకపోవడం వల్ల కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఛానల్ ప్రభావం లేకపోయినా ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించబోవడం టిఆర్ ఎస్ ఘనతగా చెప్పుకోవచ్చు. జనంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు తెల్ల ఏనుగు వంటి ఈ ఛానల్ ను మోయడమెందుకన్న అభిప్రాయానికి కెసిఆర్ కుటుంబం వచ్చింది.

నిజానికి తమిళనాడుకు చెందిన రాజ్ న్యూస్ ను పూర్తిగా టేకోవర్ చేయలేదు. నెలవారీ లీజుకు తీసుకున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి టీవీ రంగంలోకి మోహన్ బాబు వస్తుండగా కెసిఆర్ నిష్క్రమిస్తున్నారు. రాజ్ న్యూస్ ఛానల్ మొదటి నుంచి డల్ గానే ఉంది. తెలంగాణ వాదాన్ని గట్టిగా విన్పించడంలో విఫలమైంది. రాజ్ న్యూస్ ను తిరిగి రాజ్ యాజమాన్యంగా తాత్కాలికంగా నడిపే అవకాశముంది.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment