Thursday, December 30, 2010

Dasari felicitated for his contribution to television

Renowned filmmaker Dasari Narayana Rao was felicitated for his outstanding contribution to television industry at the Big Telugu Television Awards 2010. 

In a sparkling ceremony at the Shilpa Kala Vedika, popular show on Maa TV, ‘Rela Rela Re' was given the special jury award for uplifting folk art while Suma won the best anchor-female award on the occasion. 

Actors Bharani and Pallavi were conferred the best actors male and female respectively, said a press release. Organisers Organised by 92.7 Big Fm, the radio arm of Reliance Broadcast Network, the jury members for the grand finale included Murali Mohan, Kodi Srinivas Reddy and Raasi. 

Source: www.thehindu.com

Gemini launches new family drama No. 23 Mahalakshmi Nivasam

BANGALORE: The Sun Networks' Telugu general entertainment channel Gemini TV has announced the launch of a new daily family drama soap No. 23 Mahalakshmi Nivasam, which will start airing from 30 December.

Produced by Radaan Mediaworks, the soap has the production house’s founder and head of creative Raadhika Sarathkumar in the lead role.

The show will occupy Monday- Friday 8 pm band. The serial is being directed by Rajeev Prasad, and the title music has been composed by Dhina.   

The story revolves around the characters played by leading artistes in the Telugu television industry. While the spotlight is on the lead role of Mahalakshmi, the tale of the soap spans three generations of a rich Hyderabadi business family.

No. 23 Mahalakshmi Nivasam replaces Aradhana, another Radaan property which will now be aired at 3.30 pm daily. Cochin-based Vasan Eye Care has come on board as sponsors for No. 23 Mahalakshmi Nivasam.

Source: www.indiantelevision.com

Wednesday, December 29, 2010

దేశంలో తొలి వెబ్ టీవీ జనవరి నుంచి ప్రారంభం

కోచి: దేశంలో తొలి వెబ్ టీవీ త్వరలో అందుబాటులోకి రానుంది. కోచికి చెందిన వైబ్స్ విజువల్&మీడియా 'ఇండియావైబ్స్'ను జనవరి ఒకటి నుంచి ప్రారంభించనుంది. టీవీకి అవసరమైన వార్తలు, ఇతర అంశాలను టీవీనే సమకూర్చుకుంటుంది. కనులు తిప్పకుండా చూసే స్థాయిలో కథావస్తును అందించడం ఈ మాధ్యమానికి పెద్ద సవాలని.. అందువల్లే ఇందులోకి ప్రవేశించడానికి ఎవరూ గట్టిగా కృషి చేయలేదని వైబ్స్ విజువల్ వ్యవస్థాపకుడు ఆండ్రిన్ మెన్‌డెజ్ అన్నారు. తొలిదశలో ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరులను కేంద్రాలుగా చేసుకుని పని చేయనున్నట్లు చెప్పారు. తర్వాత చిన్న నగరాలకు విస్తరిస్తామని అన్నారు. జనవరి ఒకటి నుంచి www.indiavibes.tv లోకి ప్రవేశించి వెబ్ టీవీని సందర్శించవచ్చు.

Source: www.eenadu.net

రాణిస్తున్న టీవీ కళాకారులు

కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామిరెడ్డి వాఖ్య
సందడిగా సినీ గోయర్స్ బుల్లితెర 
అవార్డుల ప్రధానోత్సవం
ఈటీవీకి భారీగా పురస్కారాలు
వెండితెరకు దీటుగా బుల్లితెర కళాకారులు రాణిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అసోసియేషన్ ఆరో వార్షిక బుల్లితెర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలని, అప్పుడే వారు రాణించేందుకు అవకాశముందన్నారు. సినీ గోయర్స్ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీఎన్‌వరదాచారి, బి. కిషన్‌ల నేతృత్వంలో టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని కాలపరిషత్ అధ్యక్షుడు కొండల్‌రావు, సుబ్బా రావు, దశరథరామిరెడ్డి, అల్లూరి సుబ్బారావు, ఏల్చూరి, గజల్ శ్రీనివాస్‌లతో పాటు సినీ తారలు సాయికుమార్, కవిత, గీతాంజలి, అర్చన తదితరులు పాల్గొన్నారు. సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రదానం చేసే జీవిత సాఫల్య పురస్కారాన్ని 2009వ సంవత్సరానికి దూరదర్శన్ న్యూస్‌రీడర్‌గా సుపరిచితుడైన శాంతిస్వరూప్‌కు  అందించారు. వివిధ కేటగిరీల్లో ఈటీవీకి  చాలా అవార్డులు దక్కాయి. ఈటీవీ 'వావ్' కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు సాయికుమార్ ఉత్తమ పురుష యాంకర్‌గా అవార్డు లభించింది. ఈటీవి 'డీ3' యాంకర్ ఉదయభానుకు ఉత్తమ మహిళా యాంకర్‌గా అవార్డులు దక్కాయి. ఉత్తమ నటి అవార్డునకు మంజుల (చంద్రముఖి ఫేం) ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా రాధాకృష్ణ (తూర్పు వెళ్లే రైలు), గీత రచనకు అనంత శ్రీరాం (తూర్పు వెళ్లే రైలు), ఉత్తమ నేపధ్య గాయకుడిగా గజల్ శ్రీనివాస్ (అభిషేకం), ఉత్తమ గాయనిగా ప్రణవి (తూర్పు వెళ్లే రైలు), ఉత్తమ కెమెరామెన్‌గా వంశీ (తూర్పు పడమర), ఉత్తమ మేకప్‌మెన్‌గా అబ్బాస్ (తూర్పు పడమర), స్పెషల్ జ్యూరీ అవార్డుకు కీర్తి (తూర్పు పడమర)లు ఎంపికయ్యారు. వివిధ ఇతర టీవీ కళాకారులకు సైతం పలు అవార్డులు లభించాయి.

Source: www.eenadu.net

Tuesday, December 28, 2010

బేతంచెర్లలో సయ్యారే.. సయ్యారే..

కర్నూలు, బేతంచెర్ల, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి జానపద గేయాలు పాడే ప్రతిభను వెలికితీసేందుకు సయ్యారే..సయ్యారే టీవీ పొగ్రాం నిర్వహిస్తున్నట్లు ఐ టీవీ ఛానల్‌ నిర్వాహకులు తెలిపారు. బేతంచెర్ల పట్టణంలో స్థానిక శిశుమందిర్‌ చెందిన విద్యార్థులు గాయత్రీ, షక్రిత, సాయిశ్రీవల్లి, శ్రీదేవి, లావణ్య, లక్ష్మి, ప్రసన్నలు జానపద గేయాలు పాడే దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా టీవీ ఛానల్‌ నిర్వాహక డైరెక్టర్‌ పత్తిపాటి రమణకర్‌రావు మాట్లాడుతూ మా ఛానల్‌ ప్రాముఖ్య ఉద్దేశ్యం ఆర్థిక పరిస్థితులు సరిగా లేని పేద విద్యార్థులను జానపద కళాకారులుగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటునందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో షూటింగ్‌ చూసేందుకు పట్టణ ప్రజలు అధికంగా తరలివచ్చారు. 

 

Source: www.eenadu.net

డిటిహెచ్‌లతో.. కేబుల్‌ పరిశ్రమకు పొంచి ఉన్న ముప్పు

నిన్నటి వరకు ఎదురులేని విధంగా టీవీఛానళ్ల ప్రసారాల్లో గుత్తాధిపత్యం సాధించిన కేబుల్‌ పరిశ్రమ మనుగడకు ప్రస్తుతం ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. టెలివిజన్‌ నిత్యావసరంగా మారింది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇంట్లో టెలివిజన్‌ ఉండాలనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. ప్రస్తుతం టీవీ లేని ఇళ్లు చాలా అరుదుగా ఉన్నాయి. అప్పు చేసో, ఫైనాన్స్‌లోనో టీవీలను తీసుకుంటున్నారంటే అది ప్రజలను ఎంత ప్రభావితం చేసిందో తెలుస్తోంది. టీవీ ఉంటే సరిపోతుందా అంటే కుదరదు. కేబుల్‌ కనెక్షన్‌ ఉండాలి. దీంతో కేబుల్‌ కనెక్షన్‌కు డిమాండ్‌ పెరిగింది. కేబుల్‌ కనెక్షన్‌ కోసం ప్రజలు ఆరాటపడడంతో ప్రాంతాల వారీగా కేబుల్‌ ఆపరేటర్ల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థ మంచి ఆదాయాన్నిచ్చింది. ఆర్థికంగా మంచి లాభాలను తెచ్చి పెడుతుండటంతో కేబుల్‌ ప్రసారాల వ్యవస్థలోకి పెట్టుబడిదారులు ప్రవేశించారు. పెట్టుబడిదారుల ప్రవేశంతో కేబుల్‌ వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. కేబుల్‌ వ్యవస్థ పట్టణాల వారీగా వికేంద్రీకరణ జరిగింది. అప్పటి వరకు కేవలం సినిమాల ప్రసారానికే పరిమితమైన కేబుల్‌ వ్యవస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని దేశ, విదేశాల్లోని వివిధ ఛానళ్లను ప్రసారం చేయటం ప్రారంభించింది. ప్రాంతాల వారీగా కేబుల్‌ ప్రసారాలు చేస్తున్న ఆపరేటర్లు పెట్టుబడిదారులకు ఏజెంట్లుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేబుల్‌ పరిశ్రమ గుత్తాధిపత్యంలోకి వెళ్లింది. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా చెలామణి అవుతూ వచ్చింది. గతంలో కనెక్షన్‌కు నెలకు రూ.50 వసూలు చేసేవారు. గుత్తాధిపత్యంలోకి వెళ్లిన తర్వాత నెలకు రూ.100, తర్వాత రూ.150 వసూలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.175 వరకు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా నెల వారీ చెల్లించాల్సిన ధరలను దఫదఫాలుగా పెంచుకుంటూపోయారు. అప్పటి వరకు నెలకు వేలల్లో వస్తున్న ఆదాయం లక్షలకు చేరింది. దీంతో కేబుల్‌ ప్రసారాల వ్యవస్థపై పారిశ్రామికవేత్తల కన్నుపడింది. కోట్లాది రూపాయలను వివిధ ప్రకటనల కోసం ఎలాగూ ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఛానళ్ల ప్రసార వ్యవస్థలోకి వెళ్లితే తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవటంతోపాటు లాభాలు సొంతం చేసుకోవచ్చనే భావన పారిశ్రామికవేత్తల్లో వచ్చింది. దీంతో వారు ఈ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే ప్రసారాలు (డెరెక్ట్‌ టూ హోమ్‌) పథకాన్ని వారు అందిపుచ్చుకున్నారు. కేబుల్‌ అవసరం లేకుండానే ఉపగ్రహం నుంచి నేరుగా ప్రసారాలు చేసే కార్యక్రమం ప్రారంభమైంది. మొదటిగా డిష్‌ టీవీ ఈరంగంలో ప్రవేశించి మంచి లాభాలను ఆర్జించింది. అనంతరం టాటాస్కై, బిగ్‌ టీవీ వచ్చాయి. ఇటీవల సన్‌డైరెక్టు, ఎయిర్‌టెల్‌, వీడియోకాన్‌ వంటి సంస్థలు ప్రవేశించాయి. మొదట్లో డిష్‌ ద్వారా ప్రసారాల సేవలు పొందాలంటే మొదట్లో సుమారు రూ.నాలుగువేల వరకు చెల్లించాల్సి వచ్చేది. రూ.150 నెలవారీ చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈ రంగంలో పోటీ పెరగటంతో గత నెల నుంచి డిష్‌ కనెక్షన్‌కు కేవలం రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. నెల వారీ రూ.99 చెల్లించాలి. డిష్‌ ద్వారా 135 నుంచి 200 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఛానళ్ల ప్రసారాలను అందిస్తున్నారు. దీంతో ప్రజలు డిష్‌ కనెక్షన్‌ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. డిష్‌ కనెక్షన్ల వ్యవస్థలో పోటీ నెలకొంది. సెల్‌ఫోన్‌ కనెక్షన్‌ విషయంలో వచ్చిన పోటీ కారణంగా వాటి ధరలు ఏ విధంగా తగ్గాయో అదేలా డిష్‌ కనెక్షన్ల ధరలూ తగ్గుతాయంటున్నారు. ఛార్జీలు తగ్గితే డిష్‌ కనెక్షన్లకు ఆదరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే రానున్న ఆరునెలల్లో కేబుల్‌ పరిశ్రమ సంక్షోభంలో పడుతుందని పలువురు చెబుతున్నారు. డిటిహెచ్‌ సేవలు బలపడటం వల్ల కేబుల్‌ వ్యవస్థ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Source: www.prajasakti.com

5న టీవీ న్యూస్‌ రీడర్స్‌కు జివిఆర్‌ ఆరాధన పురస్కారాలు

మీడియా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న టీవీ న్యూస్‌ రీడర్స్‌కు జివిఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ పురస్కారాలను ప్రకటించింది. వచ్చే నెల 5న రవీంద్రభారతిలో ఈ పురస్కారాలను టీవీ న్యూస్‌ రీడర్స్‌కు ప్రదానం చేయనున్నారు. 13 చానెళ్ళకు చెందిన 13మంది టీవీ న్యూస్‌ రీడర్స్‌తో పాటు పదేళ్ళ పాటు ఈ విభాగంలో ఉత్తమ సేవలందించిన న్యూస్‌ రీడర్‌కు స్వర్ణపతకాన్ని ప్రదానం చేస్తారు. ప్రగతి మీడియా లింక్స్‌తో కలసి చేస్తున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి సంబంధించిన బ్రొచర్‌ను ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకుడు పి. విజయబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూస్‌ రీడర్స్‌ హావ భావాలు సరిగ్గా ఉన్నప్పడే వారు చదివే వార్తాంశాలకు ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. తమ గళంతో వీక్షకులను ఆకట్టుకునే న్యూస్‌ రీడర్స్‌ను గళాకారులుగా భావించి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని జివిఆర్‌ ఆరాధన సంస్థను ప్రశంసించారు. అనునిత్యం వార్తలతో జీవితం పెనవేసుకుపోయే టీవీ న్యూస్‌ రీడర్స్‌కు నంది అవార్డులను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసి దానిని సాధించిన ఘనత ఈ సంస్థకే దక్కుతుందని చెప్పారు.
సంస్థ చైర్మన్‌ గుదిబండ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ఆరేళ్ళుగా ఈ సంస్థ టీవీ న్యూస్‌ రీడర్స్‌కు పురస్కారాలను ప్రదానం చేస్తోందని వెల్లడించారు. ఈ పురస్కారాల ఎంపిక కమిటీలో జీడిగుంట రామచంద్రమూర్తి, తోట భావనారాయణ, వంగా మురళీకృష్ణారెడ్డిలు ఉన్నారని తెలిపారు. 5న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డికె అరుణ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. సన్మానకర్తగా సమాచార, పౌరసంబంధాలశాఖ కమీషనర్‌ సి. పార్థసారథి, సభాధ్యక్షునిగా పి. విజయబాబులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జాగృతి విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఓ. శ్రీనివాసరెడ్డి టీవీ న్యూస్‌ రీడర్స్‌కు స్వాతగ సత్కారం చేస్తారని చెప్పారు. పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా పద్మశ్రీ డాక్టర్‌ శోభానాయుడు శిష్యురాలు శ్రుతకీర్తి, పద్మావతి ఆర్ట్‌ అకాడమీ డైరెక్టర్‌, నాట్యగురువు అయిన పి. క్రాంతి కిరణ్‌ శిష్యబృందంచే కూచిపూడి నృత్య విభావరి ఉంటుందని వెల్లడించారు.2010 జివిఆర్‌ ఆరాధన టీవీ న్యూస్‌ రీడర్స్‌ పురస్కారాలకు ఎంపి కైన వారి వివరాలను ఎంపిక కమిటీ సభ్యుడు జీడి గుంట రామచంద్రమూర్తి ప్రకటించారు. ఎం. త్రిమూర్తులు(దూరదర్శన్‌), రవీంద్ర(ఈ టీవీ-2), రాధిక(జెమిని), రజినీకాంత్‌ (టీవీ-9), ఎం. శిరీష (టీవీ-5), శ్వేతారెడ్డి(ఎన్‌టీవీ), సుప్రజ(ఐ. న్యూస్‌), పృథ్వీరాజ్‌(హెచ్‌ఎం టీవీ), సి. ప్రతిభ(స్టూడియో ఎన్‌), ఐశ్వర్య(సాక్షి), కార్తీక్‌(మహా టీవీ), విజయ చంద్రిక(ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి), ఎస్‌. శ్రీలతారెడ్డి(రాజ్‌ న్యూస్‌)లు ఉత్తమ న్యూస్‌రీడర్స్‌గానూ ఐ న్యూస్‌కు చెందిన సత్యానారాయణ(వాయిస్‌ ఓవర్‌)లు పురస్కారాలందుకోనున్నారు. పదేళ్ళ పాటు టీవీ న్యూస్‌ రీడింగ్‌ విభాగంలో విశేష సేవలందిస్తోన్న టీవీ-9కు చెందిన సుమతికి స్వర్ణపతకాన్ని అందించనున్నామని ప్రగతి మీడియా లింక్స్‌ సిఇఓ జి. ప్రగతి చెప్పారు. ఈ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్తీక డెవలపర్స్‌ ఎండి వివి రాఘవరెడ్డి కూడా మాట్లాడారు.

Source: www.andhraprabhaonline.com

ఫేస్‌బుక్ చెంత నుండగ..ఇక వెతకక్కర్లేదు..

నూతన నటీ నటులు కావలెను - చక్కటి రూప లావణ్యాలూ.. మాట తీరు.. హావభావాలు ఉన్న అందమైన అమ్మాయి/ అబ్బాయిలు.. మేం ఫలానా బ్యానర్‌పై నిర్మించబోయే సరికొత్త చిత్రంలో నటించేందుకు వర్ధమాన నటీనటులకు ఆహ్వానం. వెంటనే పోస్ట్‌కార్డ్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేయండి - అన్న పత్రికా ప్రకటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశం. చాన్నాళ్ల పాటు సాగిన మహా ప్రహసనం. గంటల కొద్దీ స్టూడియోల బయట పడిగాపులూ.. ఏ చెట్ల నీడనో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఛాయ్ నీళ్లతో గడిపేసిన రోజులూ.. ఆడిషన్లు.. స్క్రీన్ టెస్ట్‌లతో సతమతమయ్యే డైరెక్టర్లు... - ఇలా రోజుల తరబడి కంటి మీద కునుకు లేకుండా ఉన్న రోజులవి. ఆ పరిస్థితుల్ని దాటి - తాజాగా ‘స్టార్ హంట్’ని పట్టుకోటానికి కొన్ని ఛానెళ్లు వినూత్న ఒరవడిని సృష్టించి ‘క్యాష్’ రోజులూ ఉన్నాయి. ప్రస్తుతం ఓంకార్ ‘జీనియస్’ అందుకు ఉదాహరణ. ఐతే - ఫ్రెష్ టాలెంట్‌ని చేజిక్కించుకోటానికి ఇన్ని వ్యయ ప్రయాసలూ - ప్రహసనాలూ - పరిస్థితులను దాటి కేవలం ఒక్క ‘క్లిక్’తో సెలక్షన్లు ముగిసి పోతున్నాయి. సోషల్ నెట్‌వర్క్ సైట్స్ అంటే ఆర్కుట్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్.. - ఏ సైట్ ఓపెన్ చేసినా చాలు. టన్నుల కొద్దీ టాలెంట్ స్టంట్‌లు. దర్శకుడు రాజన్ సాహి మాటల్లోనే చూస్తే - ‘బిదాయ్’ ‘చాంద్ చుపా బాదల్ మే’ ‘ఏ రిస్తా క్యా కెహలాతా హై’లోని నటీనటులంతా - ఫేస్ బుక్ నుంచో.. ఆర్కుట్ నుంచీ స్క్రీన్‌పై వెలసిన వారే నంటాడు. ‘నటన’ పట్ల ఆసక్తి చూపని యువతీ యువకులు ఈ ప్రపంచంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదేమో?! అంతలా జన జీవనంతో పెనవేసుకు పోయింది నటన. ‘వెబ్ సైట్ల’ ద్వారా టాలెంట్‌ని పట్టుకోవటం - అతి సులువైన మార్గం. ఎందుకంటే - ఇక్కడ సమయం వృధా కాదు. ఫేస్ బుక్‌లో వారివారి అభిప్రాయాలనూ.. నటనా ప్రవేశాన్నీ బేరీజు వేసుకుని ‘ఇంటర్వ్యూ’కి ఆహ్వానిస్తే సరిపోతుంది. మా క్రియేటివ్ టీంకి కూడా చెప్పేది అదే అంటాడు.
యూ ట్యూబ్‌లో ‘ఇండియన్ ఐడల్’ ఆడిషన్ వీడియో చూట్టం ద్వారా నేహా ‘చాంద్ చుపా...’కి సెలెక్ట్ అయింది. నేహా ఒక్కత్తె కాదు. అమ్రితా పురి కూడా. ఫేస్‌బుక్‌లో ఒక యాడ్ చూసి తన ఫొటోల్ని మెయిల్ చేసిందామె. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. ప్రైవేట్ ఛానెళ్లలో తనదైన ప్రతిభను చాటుతూ బాలాజీ టెలీ ఫిలిమ్స్ ద్వారా ఎన్నో సీరియళ్లను అందించిన ఏక్తా కపూర్ సైతం ఇదే పంథాని అవలంబిస్తోంది.

Source: www.andhrabhoomi.net

జనవరి 3 నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ‘అపరంజి’

నాగబాబు, మంజు భార్గవి, జయలలిత, సుహాసిని, నవభారత్ ప్రధాన పాత్రధారులుగా హరిప్రసాద్ దర్శకత్వంలో విజన్ టైం ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వైదేహి రామ్మూర్తి నిర్మిస్తున్న ‘అపరంజి’ డైలీ సీరియల్ జనవరి 3 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ - ఇప్పటివరకు 130 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 6.30 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ కథాబలం ఉండటంవల్ల, కాస్టింగ్ వల్ల క్వాలిటీతో నిర్మించటంవల్ల ఇంతవరకు ఎప్పుడూ రాని హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. తెలుగుదనం ఉన్న సీరియల్ ఇది. ప్రేక్షకులకు మరింత చేరువ కావటానికి జనవరి 3 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. ఇదే సీరియల్‌ని మొదట తమిళంలో ‘తంగం’ పేరుతో రూపొందిస్తున్నారు. జనవరి 10 నుంచి ఈ సీరియల్‌పై ‘క్విజ్’ని ఏర్పాటు చేయనున్నారు. క్విజ్‌లో గెలుపొందిన మహిళలకు ప్రతి వారం ‘టూ వీలర్’ని అందించనున్నారు.

Source: www.andhrabhoomi.net

ఛాన్స్ దొరికితే కొంగు బంగారమే!

మాటీవీ మహిళల కోసం సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు ‘కొంగు బంగారం’ అంటూ లైవ్ షోను కొత్తగా ప్రారంభించింది. ఈ షోలో పాల్గొనాలంటే ముందుగా ఎస్‌ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ గానీ ఐవిఆర్‌ఎస్ ద్వారా వాయిస్ రికార్డింగ్ గాని చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి షో టైమ్‌లో యాంకరింగ్ చేసే గాయత్రి భార్గవి ఫోన్ చేస్తుంది. అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు షోలో పాల్గొనడానికి షో టైమ్‌లో ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది.
ఎస్‌ఎంఎస్ ద్వారా పాల్గొన్న వారిలో ఇద్దరికి.. ఫోన్ ద్వారా పాల్గొన్న వారిలో ఇద్దరికి.. ఐవిఆర్‌ఎస్ ద్వారా ఇద్దరికి షోలో పాల్గొనే ఛాన్స్ దక్కుతుంది. ఈ షోకి యాంకరింగ్ చేయడంలో గాయత్రి భార్గవి జోష్‌గానే కనిపిస్తుంది. షో ఆఖరిలో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారిలో ఒకరికి 2 గ్రాముల గోల్డ్ ఎనౌన్స్ చేయడం కాస్త ఊరట కలిగిస్తుంది. వారంలో షోలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారిలో ఒకరికి వారాంతంలో లక్కీ డిప్ ద్వారా బంపర్ ప్రైజ్ ఉంటుందని కూడా ఎనౌన్స్ చేయడం జరిగింది. టోటల్‌గా విజేతలకు ఈ షో కొంగు బంగారమే! అవకాశం రాని వారి మాత్రం రీఛార్జ్‌ల రూపంలో పెనుభారమనే చెప్పాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే విన్నర్ కావాలంటే ఎక్కువ ఛాన్స్‌లు తీసుకోండని వారికి బదులు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఇలా ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాభమెవరికి? అనేది ఆడేవారికే తెలియాలి.
షో ఫార్మేట్ విషయానికి వస్తే స్క్రీన్‌పై చిత్రాలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాటి వెనుక బంగారం.. వెండి.. ఇతర హోం నీడ్స్.. మొదలైన ఐటమ్స్ దాగి ఉంటాయి. యాంకర్ ఆ రోజు షోలో ఏయే ఐటమ్స్ ఉన్నాయో ముందుగా చెబుతుంది. ఇక ఛాన్స్ దక్కించుకున్న పార్టిసిపెంట్ వాటిలో దేనినైనా కోరుకోవచ్చు. అప్పుడు వారు కోరుకున్నది ఏ చిత్రం వెనుక దాగి ఉందో గెస్ చేయాలి. ఆ గెస్ కరెక్ట్ అయితే దానిని ‘కొంగు బంగారం’ అంటూ యాంకర్ వారికి ఇచ్చేస్తుంది. ఒకవేళ కోరుకున్నది ఆ చిత్రం వెనుక రాకపోతే మరో చిత్రాన్ని యాంకర్ సహాయంతో కోరుకోవచ్చు. అప్పుడు కూడా కోరుకున్నది రాకపోతే షోలో పాల్గొన్నందుకు గాను ఒక చీరను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి పార్టిసిపెంట్‌కి నష్టమైతే లేదు. ప్రస్తుతం టీవీలకే పరిమితమైపోయే ఆడవాళ్లను సీరియళ్ల నుండి తమవైపు తిప్పుకోవడంలో మధ్యాహ్న సమయంలో దాదాపు అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లోనూ బహుమతులు అందించే రియాలిటీ లైవ్‌గేమ్ షోలు రన్ అవుతున్నాయి. రియాలిటీ షోల రేటింగ్ పెంచుకోవడానికి అతిథులను ఆహ్వానించే ఛాన్స్ లైవ్ షోల్లో లేకపోవడంవల్ల సాధారణ టీవీ ప్రేక్షకులు ఎక్కువగా బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం దక్కుతుంది. ‘కొంగు బంగారం’ షోలో పార్టిసిపెంట్స్ మొదట బంగారం కోసం ఆశ పడటం కొసమెరుపు.

Source: www.andhrabhoomi.net

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..

టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమమూ తప్పనిసరిగా ఉన్న పనులు పక్కనపెట్టి లేదా పనులన్నీ టీవీ చూస్తూనో జరుపుకునే రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. షాపుల్లో, హోటల్స్‌లో, మరో చోటో దాదాపు ప్రతిచోటా టీవీలు కనిపిస్తున్నాయి. మరి వారు చూపించే మంచి వైపు మొగ్గు చూపుతున్న వారూ ఉన్నారు. చెడువైపు ఇది వరకే ఉన్నవారు ఇంకా స్ఫూర్తిని పొందే కార్యక్రమాలు ఇటీవలి కాలంలో టీవీలో తరచూ కనిపిస్తున్నాయి. ప్రసార ఉద్దేశం ఒకటైతే జరిగేది మరొకటి అవుతుండటం గమనార్హం.
ఈ కోవలోకి వచ్చే ఒక కార్యక్రమం జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమవుతోంది. నిజానికి జి.కన్నడ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఒక కార్యక్రమానికి ఉన్న పేరును అలాగే తెచ్చి యాంకర్‌ను వేరుగా సెలెక్ట్ చేసి వారి ద్వారా సదరు కార్యక్రమాన్ని తెలుగు ఛానెల్‌లో ప్రసారం చేస్తున్నారు. ఆ కార్యక్రమం పేరు ‘బతుకు జట్కా బండి’. ఆ నిజానికి ఆ ఛానెల్ వారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో ఉన్న ఉద్దేశం గొడవలకు పాల్పడి దూరంగా ఉంటున్న వారి సంబంధాలను, వారి కర్తవ్యాలను వారికి గుర్తు చేసి వారికి హితబోధ చేయడం కావొచ్చు. కాని వారు చూపించేందుకు ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకున్నప్పుడు వాటికి సంబంధించిన షూటింగ్ జరిపేటప్పుడు కెమెరాలతో చూపించే సందర్భంలో జరిగే కొన్ని అనివార్య తప్పులను నివారించి జనానికి చూడగలిగేది మాత్రమే చూపించి, చివరలో వారు చెప్పదలచుకున్నది చెబితే చాలా బావుండేది. కాని అక్కడ జరిగింది యథాతథంగా చూపించడం. వాటిలో కొన్ని బిట్లను పదేపదే కొద్ది రోజులు ముందుగానే ఒక వస్తువును కొనే వారి కొరకు శాంపిల్స్ చూపించినట్లుగా మా కార్యక్రమాన్ని చూడండని, టీవీ చూడటం అంతగా నచ్చని వారికి కూడా ఆ కార్యక్రమం చూసి తీరాలన్న తీరుగా చూపించారు. ఇందుకు వారు ఎంచుకున్నది చాలా అభ్యంతరకరమైన దృశ్యాలే కావటం విచారకరం.
విషయానికి వస్తే ఊరూ పేరూ తెలియని కారణంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి గురించి ప్రస్తావించడం లేదు కాని గత నెల 12వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రసారమైన బతుకు జట్కా బండి కార్యక్రమంలో ఒక భార్య ఒక భర్తకు మధ్యన నడిచిన గొడవను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ జంటలో భర్త భార్యను వదిలి రెండవ పెళ్లి చేసుకున్నాడన్నది ఆ భార్య అభియోగం. కేవలం అభియోగమే కాదు కాని అక్కడ రెండవ భార్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నందున అది నిజమే. అలాగే రెండవ భార్యకు ఈయనతో రెండవ పెళ్లి జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మొదటి భార్య తన భర్త తనను కాదని రెండవ పెళ్లి అందునా పెళ్లయిన ఆమెతో కావడం. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేయడం. దాన్ని ఆ భర్త చిన్నపాటి కారణంతో సమర్థించుకోవడం కూడా అందులో కనిపిస్తుంది. ఇదంతా చూడటానికి ఒక విధంగా ఉంది. మరి ఇందుకు పరిష్కారం చూపే బాధ్యత సదరు ఛానెల్ తీసుకుంది. చట్ట పరిధిలో మాత్రమే జరిగే పరిష్కారాన్ని నేను చేస్తానని ఆ ఛానెల్ నెత్తికి ఎత్తుకొని పరిష్కారం మాట అటుంచి వారికి ఉన్న మర్యాదను కూడా తీసేసింది. వారిద్దరి సమస్యను యాంకర్ స్వయంగా వింటూ ప్రేక్షకులకు కూడా వినిపించింది. మరి సమస్యను వివరించే సందర్భంలో వారికీ వారికీ మధ్య మాటల యుద్ధం మాత్రమే జరిగినట్లయితే ఈ బాధంతా ఉండేది కాదు. వారిని కూర్చోబెట్టి చర్చోపచర్చలు జరిపి చివరకు వారు రెచ్చిపోయి ఒకరినొకరు చెప్పులతో కొట్టుకుంటూ ఉంటే వారిని విడిపించారు. అయితే వారు కొట్టుకోవడం సహజమే కాని దాన్ని యథాతథంగా చూపించడం అసహజం కాదా? మరి ఆ సంఘటనను చిత్రీకరించే స్టూడియో కెమెరామెన్ కూడా వారు కొట్టుకునే సందర్భంలో వచ్చి విడిపించే ప్రయత్నం చేసినట్లుగా టీవీలో కనిపించింది. మరి తరువాత ఎడిటింగ్ అనేదొకటి ఉంటుంది కదా? మరి వారికి ఇది అభ్యంతరకరంగా కనిపించలేదా? ఇలాంటి కార్యక్రమాలను చాలా ఛానెల్స్ చూపిస్తున్నాయి. కాకపోతే అది యధార్థ గాథ అయినప్పటికీ వారు పాత్రధారులను ఎన్నుకుని వారితో నటింపజేసి ఎంత వరకు చూపించాలో అంతవరకూ చూపించి చివరలో జరిగిన తప్పును గురించి నాలుగు విమర్శలు చేసి కార్యక్రమం ముగిస్తారు. కాని ఇక్కడ అలా జరగకపోగా కార్యక్రమం జరిగినంతసేపూ బ్రేక్‌లో ప్రతిసారి చెప్పులతో కొట్టుకోవడం చూపించి మరలా ఈ కార్యక్రమాన్ని ఈ ఛానెల్‌ను కాదని ఏ ప్రేక్షకుడూ పక్కకు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రం ఎక్కువగా కనిపించింది.
ఈ విధమైన సమస్యలను చిత్రీకరించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. సమస్యను ఎదుర్కొనే వారిలో సహజంగానే ఆవేశం ఉండొచ్చు. అందువల్ల ఎందరిలో ఉన్నా, ఎక్కడున్నా వారి ప్రవర్తన అలాగే ఉంటుంది కాబట్టి మధ్యలో ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా మరిచిపోతే ఎలా? ఈ సందర్భంగా వీరు చూపించ దలచుకొంది గొడవలనా? తన్నుకోవడాన్నా? పరిష్కారాన్నా? అన్నది చివరి వరకూ అర్థం కాకుండా పోయింది. చివరలో కొంతమంది పెద్దలను కలిపి పరిష్కారాన్ని కూడా చూపించారు. బాగుంది కాని వారు సమస్యను పరిష్కరించలేక పోయారు కారణం వారు పరిష్కరించాలనుకొన్నా దాని తీవ్రత వారిని ముందుకు వెనుకకూ పంపించలేక పోయింది.

Sourcewww.andhrabhoomi.net

టీవీ న్యూస్ రీడర్స్‌ పురస్కారాలు

ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీవీ న్యూస్ రీడర్స్‌ పురస్కారాలు జనవరి 5న రవీంద్రభారతిలో ప్రధానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షులు జీడిగుంట రామచంద్రమూర్తి ఎంపికైనవారి పేర్లను వెల్లడించారు. సీనియర్‌ న్యూస్‌ రీడర్‌కు జివిఆర్‌, ఆరాధన, ప్రగతి మీడియాలింక్స్‌ సంయుక్తంగా స్వర్ణపతకాన్ని బహూకరిస్తున్నట్లు తెలిపారు. 

Source: www.tv5news.in

'కవ్వింపు ప్రసారాల'కు తెర

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 31న తన నివేదికను కేంద్రానికి అందచేయనున్న నేపథ్యంలో 'కవ్వింపు ప్రసారాల'కు తెర దించాలని జాతీయ ప్రసార సంస్థల సంఘం (ఎన్‌బిఎ) న్యూస్‌ ఛానళ్లకు సూచించింది. సంచలనాత్మకమైన, రెచ్చగొట్టే, కవ్వించే అంశాలకు సంబంధించిన వార్తా కథనాలను ప్రసారం చేయకుండా తగు జాగ్రత్త వహించటం అవసరమని ఎన్‌బిఎ తన సభ్యులైన అన్ని ఛానళ్ల సంపాదకులకు సూచించింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని వార్తాంశాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని, ప్రజా ప్రయోజనాలను, శాంతిని కాపాడుకునేందుకు వీటిని కచ్చితంగా అమలుపర్చాలని ఎన్‌బిఎ తన లేఖలో సూచించింది. న్యూస్‌ ఛానళ్లు తాము అందచేసే సమాచారం ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేదిగా వుండకుండా తగు జాగ్రత్త వహించాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించిన అంశాల ప్రసారంలో అన్ని నైతిక సూత్రాలతో పాటు తాము సమయానుసారంగా జారీ చేసే మార్గదర్శకాలకు కట్టుబడాలని సూచించింది. హింస, ఉద్యమం, ఆత్మాహుతి వంటి దృశ్యాల కథనాలను, నివేదికకు సంబంధించిన నిరసనలు, విజయోత్సవాల వంటి వాటిని ప్రసారం చేయరాదని సూచించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించిన వార్తాంశాల ప్రసారాల క్లిప్పింగ్‌లు, స్క్రిప్ట్‌లను అవసరమైతే భవిష్యత్తు పరిశీలనార్ధం జాగ్రత్త చేయాలని సూచించింది.

నేడు 'శ్రీకృష్ణ' మీడియా భేటీ

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విలేకరులతో పాటు జాతీయ మీడియా సంస్థలకూ ఆహ్వానం పంపారు. స్థూలంగా కమిటీ రాష్ట్ర పర్యటనల సారాంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్‌ శ్రీకృష్ణతో పాటు ఇతర సభ్యులూ హాజరవ్వనున్నారు. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చే తేదీతో పాటు ఇతర అంశాలపై టివి ఛానళ్లలో వస్తున్న కథనాలపై కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ సోమవారమిక్కడ స్పందించారు.'మీడియాలో వస్తున్న పలు రకాల వార్తలపై నేను మాట్లాడను. కమిటీ ఈ నెల 31నే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది ' అని ఆయన స్పష్టం చేశారు.

Source: www.prajasakti.com

Monday, December 27, 2010

31న టీవీ ప్రసారాలకు ఎన్ బీ ఏ సూచన

తెలంగాణ అంశంపై డిసెంబర్ 31న శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల కవరేజ్ సమయంలో ""ఆచితూచి వ్యవహరించాలి'' అని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్ బీ ఏ) వార్తా చానళ్లకు విజ్ఞప్తి చేసింది.

దానికి సంబంధించి ప్రసారం చేసే వార్తలు సంచలానత్మకంగా, రెచ్చగొట్టే విధంగా ఉండరాదని ఎన్ బీ ఏ సభ్యులుగా ఉన్న ఎడిటర్లందరికి అది ఒక ఎడ్వయిజరీ పంపింది. ఎన్ బీ ఏ ఒక స్వీయ నియంత్రణ సంఘంగా పనిచేస్తోంది. 

వారు ప్రసారం చేసే సమాచరం ప్రజాభిప్రాయ నిర్మాణంపై ప్రభావం చూపుతుందనే సంగతి గుర్తుంచుకోవాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. నైతిక సూత్రాలు, ఎప్పటికప్పుడు జారీ అయ్యే నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి శ్రీకృష్ణ కమిటీ నివేదికను ప్రసారం చేయాలని ఎన్ బీ ఏ పేర్కొంది. 

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించిన అన్ని వార్తలు నివేదికలో అంశాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని, హింసాత్మక సంఘటనలు, ఆందోళనలు, ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాలు ప్రసారం చేయరాదని, నివేదికపై ఆందోళనలు లేదా సంబరాల తాలూకు ఏదేనీ దృశ్యాలను ప్రసారం చేయరాదు లాంటి మార్గదర్శకాలను సూచించింది. 

అవసరమైన పక్షంలో పరిశీలించేందుకుగాను స్క్రిప్టులతో సహాశ్రీకృష్ణ నివేదికకు సంబంధించిన ప్రసారమైన కార్యక్రమాలన్నింటిని భద్రపరచాల్సిందిగా సైతం బ్రాడ్కాస్టర్లను ఎన్ బీ ఏ విజ్ఞప్తి చేసింది.

Source: www.apweekly.com

సొంత అజెండాలతో మీడియా

వికీలీక్స్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజే ఎంత సంచలనం సృష్టించారు. అమెరికా బలహీనతలను, దాష్టీకాలను నగంగా చూపించారు. ఒక్క అమెరికానేకాదు అనేక దేశాలకు సంబంధించిన రహస్యాలను చేధించిన తీరు అబ్బురపరుస్తుంది. నిజానికి అలాంటి వ్యక్తికి ఎంతటి గౌరవం దక్కాలి. కాని ఏమి జరుగుతోంది. జరిగిన తప్పులకు చెంపలేసుకుని సరిచేసుకోవలసిన అమెరికా ఎలా వ్యవహరిస్తోంది. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ గందరగోళం సృష్టిస్తున్న అమెరికా ఇప్పుడు అసాంజేను వేటాడుతోంది. ఆయనను అమెరికా జైళ్లకు తరలించాలని చూస్తోంది. అక్కడికి వెళితే తనను హత్య చేస్తారని స్వయంగా అసాంజే ప్రకటించడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే అమెరికాతో సహా అనేక దేశాలలో పైకి సూక్తులు చెప్పేదొకటి, చేసేదొకటి అన్నది అర్థం అయిపోవడం లేదూ... చివరికి అసాంజేని సెక్స్‌ సంబంధిత కేసులు పెట్టి వేధిస్తున్న తీరు ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న వ్యవస్థలోని డొల్లతనాన్ని వెల్లడిచేస్తోంది.

ప్రపంచంలో ఉన్న వ్యవస్థలన్నిటిలోకి సర్వోత్కృష్టమైనది ప్రజాస్వామ్యం. అంతమాత్రం చేత ఈ వ్యవస్థలోను లోటుపాట్లు లేవని కాదు. కాని ఆ లోటుపాట్లు హద్దులు దాటిపోతున్నట్లనిపిస్తుంది. ఇదేదో మన దేశానికో, మన రాష్ట్రానికో పరిమితం అని కాదు. ప్రపంచం అంతటా ఉన్న పరిణామక్రమమే. అలాగే ఇప్పటికిప్పుడు ప్రజాస్వామ్యం, మీడియా పాడైపోతున్నాయని కూడా మనం అనుకోనవసరం లేదు. ఇప్పుడున్న సమస్యలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఇకపై ఉంటాయి. కాకపోతే కొంచెం తరతమ బేధాలతో, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో ఏమి జరుగుతోందో చూడండి. వికీలీక్స్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజే ఎంత సంచలనం సృష్టించారు. అమెరికా బలహీనతలను, దాష్టీకాలను నగంగా చూపించారు. ఒక్క అమెరికానేకాదు అనేక దేశాలకు సంబంధించిన రహస్యాలను చేధించిన తీరు అబ్బురపరుస్తుంది. నిజానికి అలాంటి వ్యక్తికి ఎంతటి గౌరవం దక్కాలి. కాని ఏమి జరుగుతోంది. జరిగిన తప్పులకు చెంపలేసుకుని సరిచేసుకోవలసిన అమెరికా ఎలా వ్యవహరిస్తోంది. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ గందరగోళం సృష్టిస్తున్న అమెరికా ఇప్పుడు అసాంజేను వేటాడుతోంది. ఆయనను అమెరికా జైళ్లకు తరలించాలని చూస్తోంది. అక్కడికి వెళితే తనను హత్య చేస్తారని స్వయంగా అసాంజే ప్రకటించడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే అమెరికాతో సహా అనేక దేశాలలో పైకి సూక్తులు చెప్పేదొకటి, చేసేదొకటి అన్నది అర్థం అయిపోవడం లేదూ... చివరికి అసాంజేని సెక్స్‌ సంబంధిత కేసులు పెట్టి వేధిస్తున్న తీరు ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న వ్యవస్థలోని డొల్లతనాన్ని వెల్లడిచేస్తోంది. నోబుల్‌ శాంతి బహుమతిని పొందిన లియు జియాబోను జైలు నుండి విడుదల చేయడం లేదని చైనాను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఐరోపా దేశాలు ఎలా స్పందించాయో మనం చూశాము. మరి అసాంజే విషయంలో కూడా ఆ దేశాలు అదే విధంగా స్పందించాలి కదా. నా దృష్టిలో ఇంతవరకు జర్నలిజం చరిత్రలో ఇంత సంచలనం సృష్టించిన వ్యక్తి మరొకరు లేరని అనుకుంటాను. ఇక మన దేశానికి వద్దాం. నీరా రాడియా టేపులు వ్యవహారం మన జర్నలిస్టుల లొసుగులను బట్టబయలు చేసింది. అయితే దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్న చందంగా మన వ్యవస్థ నడుస్తోంది. జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, బ్యూరోక్రాట్లు మిలాఖతై అక్రమాలకు పాల్పడుతున్న సందర్భాలు ఒక్క ఢిల్లీలోనే కాదు, అన్ని రాష్ట్రాలలోనూ జరుగుతున్నాయి. అంతదాకా ఎందుకు మన రాష్ట్రంలో జరగడం లేదని చెప్పే సాహసం నేను చేయలేను. జర్నలిస్టు మిత్రులలో కొందరు మీడియా సంస్థలకు అధిపతులయ్యారు. అందరిని అనజాలం కాని కొంతమందిపై ఆరోపణలు ఉన్నది అవాస్తవమని ఎవరం చెప్పగలం. అంతమాత్రాన వారినందరిని ఆక్షేపించే పరిస్థితి లేదు. పైగా వారు చెప్పే నీతి వాక్యాలను ప్రజలు కూడా శ్రద్ధగా వినాల్సిందే. నా అనుభవంలో ఒకటి కనిపించింది. పైరవీలు చేసే జర్నలిస్టులే అనండి, మరొకరనండి. వారికి రెండు రకాల అడ్వాంటేజెస్‌ ఉంటున్నాయి. ఒకటి ముందుగా వారికి సమాచారం లభిస్తుంది. లేదా సమాచారాన్ని వారు సృష్టించగలుగుతున్నారు. తద్వారా వారు సంబంధిత వ్యక్తులతో కలిసి అక్రమార్జన చేయగలుగుతున్నారు. అదే సమయంలో తమకు కావలసిన రీతిలో ఆ సమాచారాన్ని వినియోగించి ప్రజలను ప్రభావితుల్ని చేయగలుగుతున్నారు. మీరు అడగవచ్చు దీనికేమైనా ఆధారాలు ఉన్నాయా అని ఎన్నో ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెబుతాను. సాధారణంగా టెండర్ల వ్యవహారం పూర్తి అయ్యాక ఏవైనా మార్పులు జరిగితే మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కాని ఓ ఓడరేవు విషయంలో ఇందుకు భిన్నంగా జరిగితే ఒకటి, రెండు మీడియా సంస్థలు ఏమని ప్రచారం చేశాయో తెలుసా? అసలు జరిగిన లోపాలను బయటపెట్టకుండా ఆ ఓడరేవు ఫలానా సంస్థకు దక్కడం వల్ల ఆ ప్రాంతానికి గొప్ప మేలు జరగబోతోందని, మరి అవే ప్రచార సంస్థలు ఇంతకుముందు ఇలాంటివి జరిగితే దారుణాలు జరిగినట్లు రాశాయి. ఇక మరో అంశానికి వద్దాం. నేను ప్రతిరోజు నా వృత్తిలో భాగంగా ప్రతిరోజు వార్త పత్రికలను విశ్లేషిస్తుంటాను. అందుకోసం 14,15 పత్రికలు చూసి విశేషాలు తెలుసుకుంటాను. ఆయా పత్రికలు ఒక విషయంపై వార్తలు విభిన్న తరహాలలో రాసే తీరు చూసి ఆశ్చర్యం వేస్తుంటుంది. ఉదాహరణకు ఇవ్వాళ్టి పత్రికలనే తీసుకోండి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చిత్తూరు జిల్లాలో ఘనస్వాగతం లభించినట్లు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం మొహం చాటేసినట్లు ఒక పత్రిక రాసింది. మిగిలిన పత్రికలలో అత్యధికం కిరణ్‌కు నిరసనలు ఎదురయ్యాయని, చేదు అనుభవం అని రాశాయి. ఇందులో దేనిని ప్రమాణంగా తీసుకోవాలి. మరి ఆ పత్రికకు అలా ఎందుకు కనిపించిందంటే ఏమి చెబుతాం. వారి ఎజెండాకు అనుగుణంగా రాశారనుకోవాలి. విజయవాడలో జగన్‌ సభ గురించి ఒక తెలుగు పత్రిక, ఒక ఆంగ్ల పత్రిక అతి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా అతీతంగా ఉందని అనుకోనవసరం లేదు. ఒక టివీ ఖచ్చితంగా ఒక నాయకుడి ఎజెండా కోసం పనిచేస్తుంటే, మరో టీవీ వేరొక నాయకుడి కోసం పనిచేస్తోంది. ఇంకొక టీవీ సాధ్యమైనంత ఎక్కువగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి విశేష కృషి చేస్తుంది. మరో రెండు టీవీలు ఒక వ్యక్తిని వ్యతిరేకించడం కోసం అధికారంలో ఉన్న వారికి, ప్రతిపక్షంలో ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తీరును గమనిస్తున్నాం. మరికొన్ని టీవీలు వ్యక్తిగత ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రసారాలు చేస్తున్నమాట కూడా నిజమే. అయితే ఇవన్ని జర్నలిస్టు ప్రమాణాలకు అనుగుణంగా అసలు పనిచేయడం లేదని అనజాలం. వారికి ఇబ్బంది లేనప్పుడు, వారి ప్రయోజనాలతో సంబంధం లేనప్పుడు ఆ ప్రమాణాలను పాటిస్తుంటారు. ఎవరైనా వృత్తిపరంగా ప్రమాణాలు పాటించడం కూడా కష్టంగా ఉన్న రోజులివి. ప్రభుత్వంలో ఉన్న వారితో ఉండే అవసరాల దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదోరకంగా ఇబ్బందులు వస్తాయనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులను ఉపయోగించి ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్న సందర్భాలు మనకు తెలుసు. పార్టీలు, వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం టీవీలను, పత్రికలను పెడుతున్న రోజులలో మంచి ప్రమాణాలు ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఏ పార్టీవారు ఆ పార్టీ టీవీని చూసుకోవచ్చు. ఏ పార్టీవారు ఆ పార్టీ పత్రికను చదువుకోవచ్చు. ఇది కూడా ఒకరకంగా ప్రజాస్వామ్యమేనేమో? ప్రస్తుత మీడియా వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందన్నది కూడా చర్చనీయాంశమే. ఎందుకంటే మన సమాజం కూడా అదే రీతిలో విభజనకు గురి అవుతోంది. అది కొంత బాధాకరం. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పదలిచాను. ఇటీవలి కాలంలో మీడియా, రాజకీయ పార్టీలు కలిసి ఒక్క అంశంలో సమాజానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని చెప్పదలిచాను. మన రాష్ట్రంలో ఎవరు ఏ విధంగా చనిపోయినప్పటికీ, దానిని అప్పుడు జరుగుతున్న రాజకీయ వివాదానికో, వ్యక్తికో జోడించి అందువల్లనే ఆత్మహత్య చేసుకున్నారనో, గుండెపోటుతో చనిపోయారనో చెప్పడం ఆరంభించారు. ఉద్యమాల కోసం ఆత్మహత్యలు, ఒక వ్యక్తిని ఒక ఊరు రానివ్వకపోయినా, రానిచ్చినా ఆత్మహత్యలు, ఒక నాయకుడిని అరెస్టు చేసినా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు రాజకీయపార్టీలు చెబుతున్నాయి. మీడియా కూడా విశేషంగా ప్రచారం చేస్తోంది. అంటే అసలు ఆత్మహత్యల ఘటనలు జరగలేదని కాదు. నిజానికి ఆత్మహత్యలు చేసుకున్నవారి పూర్వాపరాలలోకి వెళ్లి రాసే ధైర్యం మీడియాకు లేని పరిస్థితి ఏర్పడడం బాధాకరంగా ఉంది. తాజా కాన్సెప్ట్‌ గుండెపోటు, ఎక్కడన్నా ఒకరిద్దరికి గుండెపోటు వచ్చి మరణించారని అనుకుంటే అర్థం వుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో ఫలానా కారణంగా గుండెపోటు వచ్చి మరణించారని పత్రికలు, టీవీలు పోటీపడి రాస్తున్నాయి, ప్రసారం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మన రాష్ట్ర ప్రజలకు ఇదే సైకిక్‌ ప్రాబ్లమ్‌ వచ్చిందని ఇతర రాష్ట్రాల వారు అనుకునే ప్రమాదం ఉంది. ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మీడియాకు స్వేచ్ఛ ఉండాల్సిందే. రాబోయే రోజులు మరింత సంక్షోభ భరితంగా ఉంటాయని అంతా భయపడుతున్నారు. ఈ భయానికి మీడియా ఆజ్యం పోయకుంటే అదే పదివేలు.

Source: www.prajasakti.com

టీవీ కార్యక్రమాలతో జాగ్రత్త...

ఇప్పుడొస్తున్న సినిమాలు, టీవీ సీరియళ్లను పెద్దవాళ్లతో కూర్చుని ఇంట్లో పిల్లలు కూడా సమానంగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తల్లిదండ్రులు కొందరు మితిమీరిన క్రమశిక్షణతో పిల్లలు ఎక్కువగా చూసే కార్టూన్‌ నెట్‌వర్క్‌, పోగో లాంటి కార్యక్రమాలను తమ పిల్లలు చూడకుండా చేసి వాళ్లను క్రమశిక్షణలో పెట్టామని మురిసిపోతుంటారు. పిల్లలు తమకు సంబంధించిన ఛానల్‌ చూడనివ్వకుంటేనేమి... పెద్దవాళ్లు చూసే సీరియల్స్‌ చూసి అందులో ఉండే హింస, ద్వంద్వార్థపు మాటలు గుర్తుపెట్టుకుని తమ మెదళ్లకు ఎక్కించేసుకుంటున్నారు. మరకొంతమంది పిల్లలైతే టీవీ ముందు లేకపోయినా చెవి మాత్రం టీవీకేసి ప్రతి డైలాగ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

అక్కడిదాకా అయితే బాగానే ఉంటుంది. అలా ఎక్కువగా టీవీ చూసే చిన్నారులమీద ఈ మధ్య అమెరికాకు చెందిన పరిశోధక బృందం బోస్టన్‌ హాస్పిట ల్‌ మానసిక వైద్యుడు డాక్టర్‌ హెర్నన్‌ చేసిన పరిశోధనలలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. చిన్నారులు ఎక్కువగా చూసే టీవీలో పాత్రల ప్రభావంతో వాళ్లు చిన్నవయసులోనే శృంగార కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పాఠశాల స్థాయి పరిధిలోనే సెక్స్‌ అంశాలు ప్రస్థావించుకోవడం గమనించారు. ఇది వైరస్‌లా మరింత ముదిరి విశ్వవ్యాప్తంగా వ్యాపించకముందే తల్లిదండ్రులకు వారు కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు...

అమెరికాలోని బోస్టన్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో సీనియర్‌ మానసిక వైద్య నిపుణుడైన డాక్టర్‌ హెర్నన్‌ తన పరి శోధక బృందంతో కలిసి 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులలో 754 మందిని పరిశీ లించారు. వాళ్లను రెండు గ్రూపులుగా విడదీసి జూనియర్స్‌, సీనియర్స్‌గా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు.ఆ తర్వాత వాళ్లను విడివిడిగా ఇంటర్వ్యూ చేసి వారి నుంచి అనేక ఆశ్చర్యం గొలిపే సంగతులను తెలుసుకున్నారు.

చెడు ప్రభావమే ఎక్కువ...
ముందుగా వాళ్లు ఎక్కువగా చూసే సీరియల్స్‌... అందులో ఉండే పాత్రలు. ఆ పాత్రలు వాళ్లను ఎందుకు ఆకర్షించాయి లాంటి ప్రశ్నలలో పిల్లలు తెలివిగా, గడుసుగా సమాధానాలు చెప్పారు. వాళ్లలో కొందరు  పిల్లలు కొందరు అంకుల్స్‌ చెడు తిరుగుళ్ల గురించి చెప్పారు. మరికొన్ని సీరియల్స్‌లో వచ్చే దుష్టపాత్రలు అభినయించే నటన, వాళ్ల మేనరిజమ్స్‌, తాము కూడా స్కూల్లో ప్రాక్టీస్‌ చేస్తుంటామని మరి కొందరు చెప్పారు. కొందరు టీవీలలో వచ్చే యాక్షన్‌ చిత్రాలలో హీరో చేసే సాహసాలు చూసి తాము కూడా అలానే చేద్దామని కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నామన్నారు. మొత్తంగా చూస్తే వాళ్లు నేర్చుకున్న దానిలో మంచి కన్నా చెడే ఎక్కువగా ప్రభావం చూపిందని తేలింది.

మన దేశంలోనూ...
ఇటువంటి సంస్కృతి మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే పాకుతోంది. ఇప్పుడు సీరియళ్లు సినిమా ఫక్కీలో సాగిపోతున్నాయి. దీనికి తోడు రియాల్టీ షోల పేరిట వచ్చే డాన్స్‌ ప్రో గ్రామ్స్‌ రికార్డింగ్‌ డాన్సులను తలపి స్తున్నాయి. వెనకటి రోజుల్లో ఏ అర్థరాత్రో, అపరాత్రో జాతర్లలో గుట్టుగా చిన్నపిల్లలు లేకుండా చూసుకుని రికార్డింగ్‌ డాన్సులను నిర్వహించేవారు. ఇప్పుడు రియాల్టీ షోల పుణ్యమా అని ప్రతి ఇంట్లో పిల్లలు బాహాటంగానే చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో లేడీ డాన్సర్లు వేసుకొచ్చే డ్రెస్సులు సినిమాలలో వాంప్‌ లు కూడా వేసుకోరేమో అనిపిస్తుంది. ఇటువంటి విష సంస్కృతి దేశమంతటా పాకిపోతోంది. పిల్లలు చదువుకోవడానికి చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల పుస్తకాలు ఉండేవి. ఈ రోజుల్లోనూ అవి ఉన్నా ఎంత మంది తల్లిదండ్రులు వాటిని చదివిస్తున్నారో ఒక్కసారి ఆత్మావన పరిశీలన చేసుకోవాలి. 
Source: www.suryaa.com

త్వరలో బిజెపి టీవీ చానెల్..

ఆంధ్రలేఖ  ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో పాగా వేయడానికి చిరకాలంగా పని చేస్తున్నా ఫలితాలు చూపలేని బిజెపి మీడియా సపోర్ట్ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నమ్ముతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి దిన పత్రిక, టీవీ చానెల్ ఏదో ఒక పార్టికి ఉపగ్రహంలా పని చేయడం కాదనలేని నిజం. యువనేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఒక దిన పత్రిక, ఒక చానెల్ నడుపుతుండగా, చంద్ర బాబు నాయడు తన కుమారునితో స్టూడియో -ఎన్ చానెల్ నడిపిస్తున్నారు. ఇతర పత్రికలూ, చానెళ్ళు ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. మీడియాపై కాంగ్రెస్, టి.డి.పి.ల పెత్తనం కారణంగా ఇతర పార్టీల కార్యక్రమాలకు సరైన ప్రచారం లభించడం లేదు. టి.ఆర్.ఎస్. వారికి రాజ్ న్యూస్ ఎలాగూ ఉంది. వామపక్షాలకు సొంత దిన పత్రికలూ ఉన్నాయి. కాని బి.జె.పి. అది కూడా లేక పోవడంతో వారి కార్యక్రమాలకు తగినంత ప్రచారం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవడం అవసరమని బిజెపి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఒక టీవీ చానెల్ తేవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే బిజెపి నేరుగా పత్రిక చానెల్ పెట్టాడు. కొందరు సానుభూతి పరులైన పారిశ్రామికవేత్తలతో చానెల్ పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి ఇదే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. 

Source: andhralekhadaily.blogspot.com

వాట్ ఈజ్ టెలివిజన్ మీడియా?!


జర్నలిజం.... ఇదో గౌరవ ప్రదమైన వృత్తి. జర్నలిస్టు ... ఇతనో సామాజిక బాధ్యతగల వ్యక్తి. ఆకర్షణ, హోదా, సామాజిక స్పృహ, సద్భావన, సదవకాశాలు కలగలసిన రంగమేదైనా ఉందంటే అదే మీడియా.  ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరుగ వచ్చునో.. మన కళ్లకు కట్టినట్లు చూపించేదీ, వివరించేదీ, విశ్లేశించేదీ, వివరణ ఇచ్చేదీ.. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలే! ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా.. అత్యంత అవసరమైన సమాచార స్రవంతిగా వెలుగొందుతోంది. నిత్యం ప్రజల జీవన విధానంతో విడదీయలేని అనుబంధంగా ఇమిడిపోతోంది. రోజురోజుకూ పత్రికలకూ, ముఖ్యంగా ఛానళ్లకూ పెరుగుతున్న క్రేజ్ ఇందుకు చక్కటి ఉదాహరణ.

                                        టీవీ మీడియా ప్రభావం

      ప్రజా జీవితంపై టీవీ మీడియా ప్రభావం... అపారమైంది. అలాంటిదాన్ని సక్రమంగా నడిపించడంలో వార్తాహరులు సృజనకారులు, సాంకేతిక నిపుణుల పాత్ర.. ఎంతో బాధ్యతాయుతమైంది. రెండూ సమాచార రంగానికి సంబంధించినవే అయినా, పత్రికలలో పనికి- టీవీలో పనికి చాలా తేడా వుంటుంది. అదే సమయంలో సంబంధం కూడా చాలా వుంటుంది. పత్రికలు చూశాక టీవీల నడక మొదలవుతుంది. టీవీలు చూపించిన దాని ప్రభావంతో పత్రికల కథనాలు కొనసాగుతాయి. పత్రికలతో పోలిస్తే టీవీల ప్రభావం.. తక్షణంగానూ- ప్రత్యక్షంగానూ వుంటుంది. జరిగిన దాన్ని నివేదించేవి పత్రికలైతే.. జరుగుతున్నదాన్ని చూపించి, జరగబోయేదాన్ని నిర్దేశించగల శక్తి టీవీలకు ఎక్కువగా వుంటుంది. ఏడాదికి లక్షల కొద్దీ వార్తాకథనాలు, వేలాది కార్యక్రమాలతో సహా.. సంక్షిప్త సమచారాలు, సినిమా- వ్యాపారం- భక్తి - వగైరా రకరకాల విభాగాలకు చెందిన అంశాలు.. నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారమవుతుంటే.. జనం కళ్లప్పగించి చూస్తూ వుండి పోతున్న తీరు విధితమే. 

కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టాలనుకున్న వారికి సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది టెలివిజన్‌ మీడియా

Source: www.televisionmedia.webs.com

బుల్లితెరపై సినీస్టార్స్‌ !

పేక్షకులు మరిచిపోలేని ఆర్టిస్ట్‌గా నిలబడటమంటే అందరికీ సాధ్యం అయ్యేపని కాదు. కానీ ఏదోవిధంగా ప్రేక్షకుల చూపులో నిలబడటం సులభమే !ఈ విషయాన్ని బాలీవుడ్‌ ఎప్పుడో గ్రహించింది. అందుకే బిగ్‌ బి అయినా, కింగ్‌ ఖాన్‌ అయినా తమదైన బుల్లితెర కార్యక్రమాలతో ఎల్లవేళలా ప్రేక్షకుల ఇంట నడయాడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, షారూక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, కరణ్‌జోహార్‌, అనుపమ్‌ఖేర్‌, ఫరాఖాన్‌, ప్రియాంకా చోప్రా...ఇలా పెద్ద పెద్ద చుక్కలన్నీ బుల్లిపెట్టెలోకి ప్రవేశించాయి. గ్లామర్‌ ఫీల్డ్‌లో నిలబడాలంటే...వెండితెర వెలుగొక్కటే సరిపోదని గ్రహించారు. ఈ గ్రహింపు ఇప్పుడు టాలీవుడ్‌లోకీ ప్రవేశించింది. సాయికుమార్‌, జయప్రద, రాధిక, సుహాసిని, రోజా, ఇంద్రజ, జగపతిబాబు, దేవయాని, లక్ష్మీప్రసన్న, సుమలత, సిమ్రాన్‌, రాజమౌళి...మొదలైన తారాతోరణం బుల్లితెరపై రంగులీనుతోంది. అందులోని కొంతమంది తారల వెలుగులు ఎలా ఉన్నాయో చూద్దాం...
జయప్రద : ఈ అందాల భామ కొన్నాళ్లు రాజకీయ ప్రయాణం చేశారు. 'జయప్రదం' అనే కార్యక్రమంతో తిరిగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేవలం సినీ ప్రముఖుల ఇంటర్వ్యూకే ఈ కార్యక్రమం పరిమితమైంది. ప్రముఖ కథానాయకులతో, దర్శకనిర్మాతలతో పనిచేసిన అనుభవం జయప్రదకు ఉండటం వల్ల టీవీ షో నిర్వహణ సలుభతరమైంది. తోటి నటీనటులు, చిత్రనిర్మాణం, కెరీర్‌ ప్రారంభంపై పలువురు నిర్మోహమాటంగా మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆసక్తికరమైన విషయాలు సినీస్టార్స్‌ నోట రావటంతో, షో బాగా క్లిక్‌ అయింది.

రాధిక : డైనమిక్‌ లేడీగా పేరుతెచ్చుకున్న నటీమణి రాధిక. సిల్వర్‌స్క్రీన్‌ నుంచి తప్పుకున్న తర్వాత, బుల్లితెరపై తనదైన ప్రయాణాన్ని మొదలెట్టింది. నిర్మాతగా, నటిగా, రాడన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ యజమానిగా...ఇలా బహుముఖ ప్రజ్ఞాపాటవాన్ని చూపుతోంది. శివయ్య, లక్ష్మీ, చిట్టెమ్మ తదితర సీరియల్స్‌కు మంచి స్పందన లభించింది. టీఆర్పీ రేటింగ్‌లోనూ ముందున్నాయి. కుటుంబ కథనాలను సీరియల్స్‌గా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతున్నారు.

రోజా : చెరగని చిరునవ్వుతో కనిపించే రోజా, ఓ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా బుల్లితెరపై సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించింది. ఊహించనట్టుగానే షో చాలా బాగా విజయవంతమైంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో పాత్రలు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఓ డ్యాన్స్‌ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. తనదైన శైలిలో, సందర్భానికి తగిన డైలాగ్స్‌తో మాట్లాడుతూ...వీక్షకులకు దగ్గరయ్యారు.

లక్ష్మీప్రసన్న : సినీ నటుడు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న తొలి అడుగులు బుల్లితెరపైనే పడ్డాయి. 'లక్ష్మీ టాక్‌ షో' సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించటంతో, మరిన్ని ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. నటిగా, టీవీ ప్రయోక్తగా, నిర్మాతగా...గ్లామర్‌ ఫీల్డ్‌లో తనదైన ముద్రను చూపాలని తపనపడుతోంది. 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో ప్రతినాయికగానూ కనిపించ నుంది. ఇందులో ఆవిడ నటకౌశలాన్ని, ఆసక్తిని చూసిన పలువురు సినీ ప్రముఖులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు.లక్ష్మీ టాక్‌ షో కార్యక్రమంలో... రాజకీయ, సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. దీంట్లో లక్ష్మీ చూపిన టాక్‌ షోకు ఫుల్లుగా మార్కులు పడ్డాయి. కొన్నాళ్లు విరామం తీసుకొని తిరిగి 'ప్రేమతో మీ లక్ష్మీ' ద్వారా మరో టీవీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినీ నేపథ్యంతో బుల్లితెరకొచ్చిన వారిలో లక్ష్మీ ముందుభాగాన నిలుస్తోంది.

జగపతిబాబు : శోభన్‌బాబు-2గా సినీ పరిశ్రమ కొన్నాళ్లు భావించింది. కానీ ఫ్యామిలీ కథనాలకు సిల్వర్‌స్క్రీన్‌పై పెద్దగా చోటు లేకపోవటంతో, మాస్‌ పాత్రలకే పరిమితమయ్యారు. పూర్తిగా హీరో వేషాలు మానుకున్నాక మొదలెట్టడం కన్నా, ఓ వైపు హీరోగా కొనసాగుతూనే బుల్లితెరపై స్థానం సంపాదించాలని జగపతిబాబు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే 'రాజు రాణి జగపతి' అనే షో నిర్వహిస్తున్నాడు. స్వతహాగా జగపతిబాబు చాలా రిజర్వ్‌డ్‌ మ్యాన్‌. షో నిర్వహణ చేయగలడా అన్న అనుమానాలు మొదట ఉండేవి ! కానీ చాలా కూల్‌గా, సరదాగా బుల్లితెరపై తనదైన స్టైల్‌తో దూసుకెళ్తున్నాడు. మొత్తానికి మంచి మార్కులే కొట్టేసాడు.


రాజమౌళి : సంచలన దర్శకుడు రాజమౌళి పూర్వాశ్రమం బుల్లితెరే ! పలు సీరియల్స్‌ డైరెక్ట్‌ చేసిన అనుభవం ఉంది. అక్కడే కె.రాఘవేంద్రరావు శిష్యరికం లభించింది. ప్రస్తుతం తెలుగు టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా రాజమౌళి దూసుకెళ్తున్నాడు. ఈయన 'కమాన్‌ ఇండియా' అనే భిన్నమైన సబ్జెక్టుతో బుల్లితెర వీక్షకుల ముందుకొస్తున్నారు. సమాజంలో ఉన్న పలు విషయాలపై ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతున్నారు.వీళ్లేగాక ఇంద్రజ, దేవయాని, సుమలత, సిమ్రాన్‌ తదితర నటీనటులు బుల్లితెరపై చాలా సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. విక్టరీ వెంకటేష్‌ కూడా ఓ మంచి ప్రోగ్రామ్‌ ద్వారా టీవీ వీక్షకులకు దగ్గరవడానికి ప్రణాళికలు వేస్తున్నాడంట ! స్వామి వివేకానంద జీవితకథ ఆధారంగా తయారవుతోన్న సీరియల్‌లో నటించే అవకాశముందని ఇండిస్టీ సమాచారం ! మంచి సబ్జెక్టుదొరికితే తాను బుల్లితెరపై చేయడానికి సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించాడు.

Source: www.prajasakti.com

Friday, December 24, 2010

యాంకర్‌లు విలవలు దిగజారుస్తున్నారు: దాసరి

టీవీ జర్నలిజం వచ్చాక పాత్రికేయుల విలువలు పడిపోయాయనీ, నేటి యాంకర్‌లకు గతం ఏమిటో కూడా తెలీకుండా న్యూస్‌లు చదివేయడం బాధగా ఉందని డా|| దాసరి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా ఫంక్షన్‌కు యాంకర్‌గా వస్తారు. అతిథుల్నే మీ పేరు ఏమిటి...? మీరు ఏమేమీ చేశారు? అంటూ ఈమధ్య చాలా మంది యాంకర్‌లు అడగడం చూశాను. నాకే సిగ్గుగా ఉంది. అందుకే అటువంటివారు గతం గురించి తెలుసుకోండి. మైకులు పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తే ఎలా? ఇంటర్వూ చేస్తుంటే.. దానికి హోంవర్క్‌ చేయాలి..? ఇవన్నీ మర్చిపోయి... ఏవేవో మాట్లాడి. జర్నలిజం విలువలుదిగజారుస్తున్నారంటూ.. దాసరి అన్నారు.

ఇక రాబోయే తరాలవారు రఘుపతి వెంకయ్య ఎవరు? అని అడిగినా అడుగుతారు. అటువంటివారు గత చరిత్రను చదవాల్సిన అవసరం ఉందని అన్నారు. సీనియర్‌ సినీపాత్రికేయుడు పసుపులేటి రామారావు రచించిన ' నాటి మేటి సినీ ఆణిముత్యాలు' పుస్తకావిష్కరణ గురువారంనాడు డా|| దాసరి నారాయణరావు విడుదల జేయగా తొలిప్రతిని ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడు చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... నిబద్ధత గల జర్నలిస్టుగా పసుపులేటి పేరు సంపాదించారనీ, ఓ ఫంక్షన్‌లో తాను పలుకరించకపోతే అలిగాడనీ, ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసేదాకా శాంతించలేదని గుర్తుచేసుకున్నారు.

Source: telugu.webdunia.com

బుల్లితెరపై వెండితెర సినిమాకు శ్రీకారం

జంగారెడ్డిగూడెం: బుల్లితెరపై వెండితెర సినిమా చూపించేందుకు ఆద్రి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ సరికొత్త ప్రయోగానికి గురువారం శ్రీకారం చుట్టింది. స్థానిక గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో త్వరలో రానున్న ఆద్రి ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ వెండి తెర క్వాలిటీతో చూపించే సినిమా షూటింగ్ ప్రారంభించింది. ఆద్రి మినీ బ్లాక్ బస్టర్ మూవీస్ పేరుతో సినిమాలను రూపొందిస్తున్నట్టు ఆద్రి క్రియేటివ్ టీం తెలిపింది. దీనిలో భాగంగా మొట్టమొదటిసారిగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేదికగా సినిమా రూపొందిస్తున్నట్టు తెలిపింది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర సన్నివేశాలను దేవీపట్నం, పోలవరం, పట్టిసీమ, బుట్టాయగూడెం తదితర ప్రాంతాలలో చిత్రీకరిస్తామని తెలిపింది. ఇటువంటి చిత్రం తమ కళాశాలలో రూపొందించడం సంతోషమని షూటింగ్‌ను ప్రారంభించిన గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ చిట్టూరి గణేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి దశరథ్, చిత్ర దర్శకుడు బి.ఎన్.రెడ్డి, నటీ నటులు జ్యోతిశ్రీతేజ్, సుభాష్, శే్వత, ఉష, జాహ్నవి, సోగ్గాడు శ్రీను, మూవీ మేనేజర్ తిరుమల యాళ్ళ తదితరులు పాల్గొన్నారు.

Source: www.andhrabhoomi.net

Four new Telugu channels to go on air

Telugu television is all set to get more colourful and offer more choices for viewers soon. Four more channels covering different segments are in the offing with Aadri Television gearing up to unveil its beaming in coming three months.

The bouquet of four channels being worked out at present are entertainment, health, movies & music apart from enrich-spiritual. Having set up a team of more than 100 professionals, including several fresh talent, the plans are to be able to roll out by March-end, says Rubina Praveen, Director & CEO.

These channels are also being positioned as country's first end-to-end HD channels and the entire production at present is being handled in-house. “Content is going to be our strength and we have been doing the ground work for almost two years,” says Rubina, who has a track of documentary filmmaking apart from stints with ETV-2 and Vanitha TV.

A thorough mix will be on offer for viewers by all the channels and some ambitious projects are also taking shape. “We are coming out with Aadri Mini Blockbusters which will have one-hour movies specially produced by us,” reveals R. Anil Kumar, Chief Programming Officer. Games, realty shows and other entertainment offering content apart, there are appropriate segmentations for these channels, he adds. 
Soon after these four get going, the plans are to go for more regional channels covering different parts of the country.

Source: www.thehindu.com

Aadri Television

Aadri Television, four new Telugu channels in coming three months ready to unveil,Telugu television get more colourful and offer more...

Four new channels covering different areas are in the offing with Aadri Television gearing up to unveil its beaming in coming three or four months. The bouquet of four channels being worked out at present are entertainment, health, movies & music apart from enrich-spiritual.

Having set up a team of more than 100 professionals,including several fresh talented, the plans are to be able to roll out by March-end,says Rubina Praveen, Director & CEO. These channels are positioned as INDIA's first end-to-end HD(high-definition) channels and the entire production at present is being handled in-house. A thorough mix will be on offer for viewers by all the channels and some ambitious projects are also taking shape. Games, realty shows and other entertainment offering content apart, there are appropriate segmentation for these channels. Soon after these four get going, the plans are to go for more regional channels covering different parts of the country. 

Source: www.beatrend.com

Wednesday, December 22, 2010

Sharrath Marar, Director and CEO of Maa Television Network, quits

Even as Maa Television Network is gearing to launch new channels, it has lost its Director and CEO Sharrath Marar, who has put in his papers, according to sources close to the development. It is not known where Marar is headed next. He has been with Maa Television Network for close to four years. When contacted, Marar declined to comment.

Marar has earlier been associated with Amitabh Bachchan Corporation Ltd (ABCL), where he was GM - South. He later started his company called South Parade, which had played a key role in some of the big brand endorsements down South. In January 2007, he joined Maa Television Network Ltd.

As reported by exchange4media earlier, Maa Television Network is on the brink of launching two new channels – Maa Junior and Maa Movies. The network already has its flagship channel Maa TV and Maa Music. In the short span since the launch of Maa TV in 2002, the channel s said to have become a formidable player in the Telugu GEC market.

In the year 2008, the channel had revamped its logo to bring a fresh perspective, and since then has been able to revamp its programming and managed to attract young talent to the company. This helped to change the perception of the channel, resulting in maintaining financial balance and garnering increased channel viewership.

Source: www.exchange4media.com

TV9 looks at Saif ahead of IPO plans; to seek FIPB nod again

MUMBAI: The Foreign Investment Promotion Board (FIPB) has rejected the proposal of Hyderabad-based Associated Broadcasting Company Ltd (ABCL), which runs a clutch of regional news channels, to give stake to Mauritius-based private equity fund Saif III Mauritius Company, ahead of its broader fund-raising plans including an initial public offering (IPO).

Saif, a subsidiary of Tokyo-based Softbank Corp, was to effectively hold around 14.5 per cent for around Rs 510 million, valuing the news broadcasting company at Rs 3.5 billion.

“This is part of our broader fund-raising plan. Saif has investments in other broadcasting outfits (Network18 Media and HomeShop18) and our valuation would go up. It will be a precursor to an initial public offering (IPO) or a private placement as we pursue our expansion plans,” a source in the company said.

ABCL operates six news channels including TV9 AP (Telugu), TV1, TV9 Karnataka, News9 English (Bangalore), TV9 Gujarat, and TV9 Mumbai (Hindi).    

“We will need funding for our expansion programme. After running a successful fleet of regional news channels, we are looking at a national news channel in the Hindi space,” said the source.

Post Saif’s investments, iLabs and Unified Group will have around 65.5 per cent stake in ABCL, down from the current 80 per cent, the source added. Ravi Prakash will have 10 per cent and the other 10 per cent is allotted in form of ESOPs.

ABCL has decided to file a revised proposal to get the FIPB nod. In its earlier application, it had sought merger of a company that is controlled by Saif with itself. It would have issued and allotted compulsory convertible preference shares on the date of completion of the merger.

The company will also approach the court for approval of the amalgamation scheme.

According to the source, Saif had taken almost entire ownership of iVision Media India for around Rs 510 million. iVision Media India, owned then by the promoter of iLabs, was into the news agency business but had gone dormant. Saif had invested to revive the company.

Later, ABCL took around Rs 510 million as a loan from iVision. The condition was that it either pay back the amount to Saif or part with equity.

“Our intention now is to amalgamate iVision with ABCL and part with around 14.5 per cent equity. We will do that once we get the FIPB approval,” the source said.

ABCL is expecting to post a revenue of Rs 1.3 billion for the fiscal ended March 2011, up from Rs 1 billion a year ago.

Source: www.indiantelevision.com

ఛానెళ్ల తీరుకి రజనీ కినుక

ఏషియా నెట్ చూసేవారికి - రజనీ హరిదాస్‌ని ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఆ మాటకొస్తే - అడపాదడపా తెలుగు ఛానెళ్లకూ చిరపరిచితురాలే. ఒక్కమాటలో చెప్పాలంటే - ఐడియా స్టార్ సింగర్ రియాల్టీ షో రజనీ గళ మాధుర్యం ఏదో ఛానెల్‌లో వినిపించేదే. యువతని అడిగితే - దట్ హాట్ గర్ల్ అంటారు. ఎప్పుడూ పొందికైన చీరకట్టుతో కనిపించే రజనీ అటు తమిళ, తెలుగు, మలయాళ, కేరళ, హిందీ, బెంగాలీ.. ఛానెల్స్ తిరిగొచ్చింది. సంప్రదాయబద్ధంగా భారతీయ సంస్కృతికి చక్కటి ఆనవాలుగా ఉండే ఈ సెలబ్రిటీ గురించి చెప్పుకోవాలంటే బోలెడన్ని సంగతులు. రజనీ 2000లో మిస్ కేరళ కిరీటాన్ని చేజిక్కించుకుంది. మోడల్‌గానూ గాయనిగానూ నటిగానూ కెరీర్‌ని ఆరంభించిన మొదట్లో ఏషియా నెట్ యాంకర్‌గా ‘సాహసికంటె లోకం’ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించింది. అప్పట్లో స్వచ్ఛమైన మలయాళ భాషలో గలగల మాట్లాడే అమ్మాయి కోసం వెతుకుతూంటే అనుకోకుండా ‘రజనీ’ కనిపించింది. అప్పటికే కొన్ని స్టేజ్ ప్రదర్శనలిచ్చి ఉండటంవల్ల ఆ కార్యక్రమ నిర్వహణ ఏమంత కష్టం అనిపించలేదామెకు. సంప్రదాయ జానపద శాస్ర్తియ సంగీతాన్ని ప్రాంతాలవారీగా పరిచయం చేసే కార్యక్రమం అది. ఐడియా స్టార్ సింగర్ కావటానికీ, రాక్ మ్యూజిక్ టాలెంట్‌ని చూపెట్టటానికి రజనీకి ఇది వేదికగా మారింది.
ప్రేమ వ్యవహారం అంటే అస్సలు గిట్టదట. ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. దీని కోసం ఇన్ని మర్డర్లు, ఆత్మహత్యలు అవసరమా? అని ప్రశ్నిస్తోంది. అన్ని ఛానెళ్ల ప్రేక్షకులు ఇంతగా ఈమెని అభిమానిస్తున్నా - మలయాళ ఛానెల్స్ మాత్రం ఈమెని ఒప్పుకోవటం లేదు. ప్రేక్షకులు తిరస్కరించేశారు. వారి ఆలోచనా స్థాయికి నేనింకా చేరుకోలేదేమో? అంటోంది. మలయాళ ఛానెల్స్ వేరే ఛానళ్ల ప్రభావానికి లోను కాకుండా ఉంటే బావుంటుందేమోనన్న అభిప్రాయాన్నీ వెలిబుచ్చింది. దాంతో - సొంత ఛానెళ్ల తీరుకి కినుక వహించి - ఎంటీవీ వైపు, మిగతా మ్యూజిక్ ఛానెల్స్ వైపు దృష్టి మరల్చింది. ఛానెల్ వి’లో ‘వెన్ లవ్ బైట్స్’ షోలో తనదైన గళ మాధుర్యంతో జనాన్ని ఆకట్టుకొంది. త్వరలోనే ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఛానెళ్లలోనూ వినిపించబోతోందిట. టాలెంట్ ఉండీ - మలయాళ ఛానెళ్లలో నెగ్గుకు రాలేకపోవటానికి కారణం ఏమిటన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది ఆమె విషయంలో.

Source: www.andhrabhoomi.net

మనోహరం శ్రీ రాఘవేంద్రస్వామి మహాత్మ్యం

భారతదేశం సర్వ వేదాలకు, సకల శాస్త్రాలకు పుట్టినిల్లు. మహనీయులుగా మన్ననలు అందుకున్న ఎందరో ఆధ్యాత్మిక గురువులు సత్య - ధర్మ - జ్ఞాన మార్గాలను ప్రజలకు చూపుతూ వారి జీవన విధానాన్ని సుసంపన్నం చేశారు. భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అంతగా ప్రభావితం చేసిన అలాంటి మహనీయులలో ఒకరు శ్రీ రాఘవేంద్ర స్వామి. మహత్తరమైన ఆయన జీవన శైలినీ, అందులోని అనూహ్య మలుపులనీ, మహిమలనీ మనోహరంగా మలచి ‘శ్రీ రాఘవేంద్ర స్వామి మహాత్మ్యం’గా అందిస్తోంది జీ తెలుగు.
Source: www.andhrabhoomi.net

Tuesday, December 21, 2010

సరిగమలతో ఉపాధి మార్గాలు

(గతవారం తరువాయి)
హృదయాన్ని కదిలించే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే వుంది. వినోద ప్రపంచం విస్తరిస్తున్న నేటి తరుణంలో యువత సంగీత రంగం వైపు ఆసక్తి చూపుతోంది. ఇందులో ఎలా ప్రవేశించాలి? కావాల్సిన అర్హతలేంటి? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గతవారం కోర్సుల గురించి, శిక్షణ గురించి చర్చించాం. మ్యూజిక్‌ కంపోజర్స్‌/ సాంగ్స్‌ రైటర్స్‌ కెరీర్లోకి ప్రవేశించే తీరూ, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నాం. మిగిలిన పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సింగర్స్‌/పెర్ఫార్మర్స్‌: పాటను వాయిద్యాలు లేకుండాను, వ్యాయిద్యాలతోనూ ఒంటిరిగానూ, బృందంగానూ, ఆలపించవచ్చు. ఈ కోర్సులు చేసేవారు కూడా సోలో పెర్ఫార్మర్‌గాను, గ్రూప్‌ పెర్ఫార్మర్‌గానూ రాణించవచ్చు. వాయిద్య సంగీతకారులుగానూ, క్లాసికల్‌ సింగర్స్‌గానూ, పాప్‌ ఆర్టిస్టుగానూ ఎదగవచ్చు. వాయిద్యకారులు కూడా టెక్నికల్‌ స్కిల్స్‌ అలవర్చుకోవాలి. ఇతర సంగీత విభాగాల్లోనూ అవగాహన పెంచుకోవాలి. చిన్నవీ, పెద్దవీ అన్నతేడా లేకుండా పబ్‌లు ఆడిటోరియంలు, రీ రికార్డింగ్‌ సెంటర్ల వరకూ అన్నిచోట్లా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాయిద్య సంగీతం అందించాల్సి వుంటుంది. అలానే సింగర్స్‌ కూడా గేయాలను ఆలపించాల్సి వుంటుంది. వివిధ రికార్డింగ్‌ సెంటర్లలోనూ, పబ్బుల్లో, నైట్‌ క్లబ్బులలో వీరికి అవకాశాలు లభిస్తాయి. సినీ పరిశ్రమలో నేపథ్య గాయకులుగా రాణించవచ్చు.

ఆర్టిస్టు/మ్యూజిక్‌ మేనేజ్‌మెంట్‌: ఆర్టిస్టు మేనేజ్‌మెంట్‌ అంటే సంబంధిత కళాకారుల కార్యక్రమాల షెడ్యూలు, తదనుగుణంగా ప్రణాళిక, సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులు నిర్వహించే ఆర్టిస్టు

మేనేజర్లుగా ఉండేవారు బయటకు కనిపించని ఇబ్బందులను పసిగట్టాల్సి వుంటుంది. మ్యూజిక్‌ రంగంలో బిజినెస్‌ వ్యవహారాలపట్ల అవగాహన, తమ కళాకారుడి అవసరాలకు అనుగుణంగా చక్కదిద్దాల్సి వుంటుంది. సినీ, రేడియో, టెలివిజన్‌, యాజమాన్యాలతో సత్సంబంధాలు కలిగి వుండి, సంప్రదింపులు జరుపుతుండాలి. తమ కళాకారుడికి అవకాశాలను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించాలి. మ్యూజిక్‌తో పాటు మీడియాపట్ల అవగాహన ఉండాలి. ఆ రంగాలకు చెందినవారితో పరిచయాలు పెంపొందించేలా ప్రనాళికలు రూపొందించాలి. కళాకారునికి తగిన ప్రయాణ ఏర్పాట్ల దగ్గర నుంచి సంస్థాగత కార్యక్రమాల వరకు అన్నీ చూసకోవాల్సి వుంటుంది.

మ్యూజిక్‌ జర్నలిస్టు: కళాకారుల ఇంటర్వ్యూలు తీసుకోవాల్సి ఉంటుంది. రీ రికార్డింగ్‌లను, ఆల్బమ్‌లను, సంగీత ప్రదర్శనలను, ప్రదర్శనకారుల శైలినీ సమీక్షించాల్సి వుంటుంది. తాజా సంగీతోత్సవాలకు రీ రికార్డింగ్‌ రిలీజ్‌ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలను అందించాల్సి వుంటుంది. మరి కొందరు సినీ విమర్శకుల మాదిరి

సంగీత విమర్శకులుగా కూడా రాణించవచ్చు. అలాగే ప్రిలాన్స్‌ జర్నలిస్టుగా రాణించేందుకు ఈ మ్యూజిక్‌ రంగం దోహద పడుతుంది. వివిధ వార్తా పత్రికలకు మ్యాగజైన్లకు, టివి ఛారళ్లకు, రేడియోలకు, వివిధ వెబ్‌ సైట్లకు వీరు పనిచేయవచ్చు. ఇందులో రాణించాలంటే సంగీతంపై అభిమానంతోపాటు భాషపై మంచి పట్టు వుండాలి. సంగీతమంత హృద్యంగా రాయగలిగే నేర్పు ఉండాలి.

మ్యూజిక్‌ ఎడ్యుకేటర్‌/టీచర్‌: సంగీతంలో పట్టు సాధించిన వారు సంబంధిత రీతుల్లో, ప్రత్యేకంగా స్కూళ్లు ఏర్పాటు చేసుకొని శిక్షణ ఇవ్వవచ్చు.పెద్దపెద్ద సంస్థల్లో టీచర్లుగా పనిచేయవచ్చు. వివిధ కాలేజీల్లో, పాఠశాలల్లో సంగీత పరిచయ క్లాసులు నిర్వహించవచ్చు. సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసను విద్యార్థుల్లో పెంపొందించే నైపుణ్యాన్ని వీరు అలవర్చుకోవాల్సి వుంటుంది. సహనం, విద్యార్థి మనస్తత్వాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం సంగీత టీచర్లకు ఉండాలి.
మ్యూజిక్‌ థెరపిస్టు: కొన్ని ప్రత్యేక సంగీత రీతుల ద్వారా మానసిక, భావోద్వేగాలను దృఢం చేయవచ్చు. మ్యూజిక్‌ థెరపిస్టులకు రిథమ్‌, మెలోడి విషయాల్లో ప్రత్యేక శిక్షణ పొందాల్సి వుంటుంది భావోద్వేగ స్థిరత్వం, ఆలోచన, దృక్పథం వీరికి అవసరం. శబ్దాలను సృజనాత్మకంగా ఆలపించే విధానం, వల్లించే నేర్పు, విశ్లేషణ, లోతైన అవగాహన మెండుగా ఉండాలి. అన్ని వయస్సుల వారికి వీరు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాల్సి వుటుంది. మానసిక రుగ్మతలు, మనోవైకల్యం, సంభాషణ, వినికిడి సంబంధిత సమస్యలు, శారీరక వైకల్యంతో మానసికంగా కృంగిపోవడం, న్యూరోలాజికల్‌ రుగ్మతలు తదితర సమస్యలున్న వారిలో వీరు మార్పు తేవాల్సి వుంటుంది. వారి మనోవికాసానికి సంగీతం ద్వారా కృషి చేయాల్సి వుంటుంది. ఎంతో నేర్పు సాధిస్తే గానీ ఈ రంగంలో నిలదొక్కుకోవడం సులభం కాదు. ఫిజియో థెరపిక్‌ ఆస్పత్రులు, కమ్యూటీ మెంటల్‌ హెల్త్‌ ఏజన్సీలు, మనోవికాస కేంద్రాలు నర్సింగ్‌ హోమ్‌లు, మానసిక వికలాంగుల ఆశ్రయాల్లో మ్యూజిక్‌ థెరపిస్టులకు అవకాశాలు ఉంటాయి. వీరు ప్రయివేటుగా కూడా ప్రాక్టీస్‌ నిర్వహించుకోవచ్చు. మ్యూజికాలజిస్టు: సంగీతంలో చక్కటి పరిజ్ఞానం పెంపొందించుకొని వివిధ సంస్థల్లో, కార్యాలయాల్లో సిబ్బందికి, వివిధ తరగతుల ప్రజలకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించే మ్యూజిక్‌ కార్యక్రమాలు రూపొందించవచ్చు. ఇలాంటి వారికి పరిశోధనా సంస్థల్లో చక్కటి అవకాశాలు లభిస్తాయి.
వీడియో జాకీస్‌ (విజెస్‌/ డిస్క్‌ జాకీస్‌(డిజెస్‌): మ్యూజిక్‌ ఛానళ్లు పెరగడంతో వీడియో జాకీస్‌కు, ఎఫ్‌ఎం స్టేషన్ల పెరుగుదలతో డిస్క్‌ జాకీస్‌లకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. వీరికిప్పుడు అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. కళాకారులతో ఇంటర్వ్యూలు నిర్వహించడం, ప్రేక్షకులతో మాట్లాడుతూ వారిని మెప్పించడం, కోరిన పాటలు, వీడియోలు ప్రసారం చేయడం వీరి పని. విజేలు, డిజెలుగా ప్రత్యేకించి విద్యార్హతలేవీ అక్కర్లేదు. సందర్భోచిత సంభాషణా చాతుర్యం తప్పనిసరి. ఒకింత హాస్యం, కళా రంగం పట్ల కాస్త అవగాహన అవసరం. అంతేకాదు జనరల్‌ విషయాలు, వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన ఉండాలి. స్పష్టమైన చర్చ, వివిధ మాండలికాల్లో సంభాషించగల నేర్పు ఉండాలి. అనేక రకాల సంగీత రీతులు, ప్రముఖ సంగీతకారుల శైలి, ఆల్బమ్స్‌పట్ల అవగాహనతోపాటు వాటిని సమీక్షించి విశ్లేశించే సామర్థ్యం ఉండాలి. దీంతోపాటు మంచి బాడీ లాంగ్వేజ్‌, డ్రెస్‌సెన్స్‌ చాలా అవసరం.

మ్యూజిక్‌: మ్యూజిక్‌ లైబ్రరీయన్‌:

సంగీతంలో పరిజ్ఞానముండి, లైబ్రరీ, రీసెర్చ్‌ అంశాల్లో శిక్షణ పొందినవారికి కాలేజీలు, సంగీత శిక్షణా సంస్థలు, లైబ్రరీల్లో అవకాశాలు లభిస్తాయి. అలాగే రేడియో, టెలివిజన్‌, చిత్ర నిర్మాణ సంస్థల్లోనూ మ్యూజిక్‌ లైబ్రరీయన్లకు అవకాశాలు లభిస్తాయి. ఏదైనా సంగీత కోర్సుతోపాటు ఇందులో ఉపాధి పొందాలనుకునేవారికి లైబ్రరీ సైన్సులో కనీసం బ్యాచులర్‌ డిగ్రీ ఉండాలి.

సంగీతంలో వివిధ రకాల కోర్సులు:
*బి.ఎ. (హానర్స్‌) మ్యూజిక్‌
*బి.ఎ. (విజువల్‌ ఆర్ట్స్‌/మ్యూజిక్‌/డ్యాన్స్‌/డ్రామా
*బి.ఎ.మ్యూజిక్‌
*బి.ఎ. తబలా
*బి.ఎఫ్‌ఎ సితార్‌
*బి.ఎఫ్‌ఎ తబలా
*సర్టిఫికెట్‌ కోర్సు (మ్యూజిక్‌)
*సర్టిఫికెట్‌కోర్సు (మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌)
*సర్టిఫికెట్‌ కోర్సు మ్యూజిక్‌ అప్రిసియేషన్‌ అండ్‌ మ్యూజిక్‌)
*డిగ్రీ (మ్యూజిక్‌)
*డిప్లొమా ఇన్‌ మ్యూజిక్‌
*డిప్లొమా ఇన్‌ సితార్‌
*డిప్లొమా ఇన్‌ తబలా
*డిప్లొమా ఇన్‌ ప్రొఫిసెన్సీ కోర్స్‌ ఇన్‌ మ్యూజిక్‌
*ఎం.ఎ.మ్యూజిక్‌
*ఎంఫిల్‌ ఇన్‌ మ్యూజిక్‌
*పిహెచ్‌డి ఇన్‌ మ్యూజిక్‌
*యుజి డిప్లొమా కోర్సు ఇన్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌
*ప్రయివేటు డ్యాన్స్‌ అండ్‌ మ్జూఇక్‌ స్కూల్స్‌ అందించే వివిధ కోర్సులు

ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజిక్‌ కోర్సులు అందిస్తున్న సంస్థలు
ఆంధ్రా యూనివర్సీటీ, విశాఖపట్నం : బిఎ మ్యూజిక్‌
నాగార్జునయూనివర్సిటీ, నాగార్జునాసాగర్‌ : బిఎ మ్యూజిక్‌
http://www.nagarjunauniversity.ac.in/
రాష్ట్రీయ సంస్కృతీ విద్యాపీఠ్‌ , తిరుపతి : బిఎ మ్యూజిక్‌
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం : బిఎ మ్యూజిక్‌
http://www.skuniversity.org/
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ , తిరుపతి : బిఎ మ్యూజిక్‌
http://www.svuniversity.in/

సంగీత ఉపాధి కల్పవృక్షాలు
1. దూరదర్శన్‌ తదితర టెలివిజన్‌ ఛానెళ్లు
2. ఆకాశవాణి, ఇతర ప్రయివేటు ఎఫ్‌ఎం ఛానెళ్ల స్టేషన్లు
3. మ్యూజిక్‌ ఛానెళ్లు
4. ప్రభుత్వ సాంస్కృతిక, ప్రజా సంబంధాల శాఖలు
5. నిర్మాణ సంస్థలు
6. సంగీత పరిశోధనా సంస్థలు
7. మ్యూజిక్‌ ట్రూపులు
8. మ్యూజిక్‌ కంపెనీలు
9. విద్యా సంస్థలు, కళా కేంద్రాలు
10. ఫిజియో థెరపి ఆస్పత్రులు


Source: www.prajasakti.com

Telugu Live Tv Channels Websites

http://telugutelevisionmedia.blogspot.com/2010/11/telugu-live-tv-channels-websites.html

తెలుగు లైవ్ టీవీ ఛానెల్స్ వెబ్ సైట్స్.

http://telugutelevisionmedia.blogspot.com/2010/11/blog-post_12.html

ఛానెళ్ల బిజినెస్‌కు - మూడు ఆడియోలు.. ఆరు సినిమాలు

సినిమాకు కొబ్బరికాయ గుమ్మడికాయలతో అవినాభావ సంబంధం ఉంది. కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే గుమ్మడికాయ కొట్టి ఫినిష్ చేస్తారు. బుల్లితెర జోరందుకోవడంతో వెండితెరకు ఆదరణ కొంత తగ్గింది. సూపర్ డూపర్ హిట్ అంటేనే అదీ వౌత్ టాక్ వస్తేనే జనం థియేటర్లకు కదలి వస్తున్నారు. బావున్న సినిమాకు టికెట్ ధరను ఎంతైనా చెల్లించడానికి వెనుకాడటం లేదు. అందుకే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఏదో ఒకటో అరో మాత్రమే కోట్లను కొల్లగొడుతున్నాయి. ఇండస్ట్రీ కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. సీరియల్స్, స్పెషల్ స్టోరీస్, గేమ్స్ షోస్ వంటివి ఎన్ని వున్నా రోజుకి కనీసం మూడు సినిమాలను వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇదికాక ప్రతిరోజూ సినిమాను ఆసరాగా తీసుకుని ఎన్నో కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి నడుస్తుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్లు, డబుల్ ప్లాటినమ్ ఫంక్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఛానల్స్ దక్కించుకుని ప్రసారం చేయడంలో పోటీ పడుతున్నాయి. ఈ పరంపరలో న్యూస్ ఛానెల్స్ కూడా పోటీ పడటం విశేషం.

సినిమాలకు గవర్నమెంట్ ఇచ్చే నంది అవార్డులతో పాటు ప్రైవేటు పాపులర్ సంస్థలిచ్చే అవార్డుల ఫంక్షన్లు కూడా బుల్లితెరపై అలరిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లు గంటల కొద్దీ నడవడంతో ఛానల్స్‌కి చాలా టైమ్ కలిసి వస్తుంది. ఇలాంటి ఈవెంట్స్‌లో పాపులర్ స్టార్స్ ఎక్కువగా కనిపిస్తారు కనుక ఈ ఈవెంట్‌లను నిర్వహించడానికి, పార్టనర్లుగా వ్యవహరించడానికి రేటింగ్ వున్న ఛానల్స్ విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈవెంట్ మా ఛానెల్‌లోనే ‘ఎక్స్‌క్లూజివ్’ అంటూ వేసుకోవడం వలన అభిమానులు, ప్రేక్షకులు టెలివిజన్ సెట్స్ ముందు కూర్చుండటంతో ఛానల్‌కి రేటింగ్ కూడా బాగా పెరుగుతోంది. ఈ రేటింగ్‌ల ఆధారంగా స్లాట్స్ అమ్ముకోవడంలో ఛానల్స్ సక్సెస్ అవుతున్నాయి.
 
ప్రధానంగా క్రేజీ స్టార్స్ ఆడియో ఫంక్షన్లను నిర్వహించడానికి ఛానల్స్ మధ్య పోటీ ఏర్పడుతోంది. ఈ తరహా ఫంక్షన్ల్లను ఎక్కువగా ‘మా టీవీ’ నిర్వహించడంలో సక్సెస్ అవుతోంది. నాగార్జున, చిరంజీవి కుటుంబ హీరోల ఫంక్షన్లు అయితే మాటీవీలోనే ప్రసారమవుతాయనే ముద్ర పడిపోయింది. ఆడియో ఫంక్షన్లు నిర్వహించడంలో నెంబర్ వన్ రేటింగ్ వున్న టీవీ-9 కూడా ముందుంటుంది. గతంలో ‘కొమరం పులి’ వంటి క్రేజీ కాంబినేషనల్స్‌తో తయారైన సినిమా ఆడియో ఫంక్షన్ నిర్వహించిన టీవీ-9 ఇటీవల అంతే ఉత్కంఠత కలిగిస్తూ ‘నాగవల్లి’ ఆడియో ఫంక్షన్‌ని ప్రసారం చేసింది. అగ్రహీరోల ఆడియో ఫంక్షన్లను అప్పుడప్పుడు నిర్వహించడంలో వార్తా ఛానెల్ టీవీ-9ది ప్రత్యేక స్టయిల్. ఎన్‌టివి కూడా ఇలాంటి ఫంక్షన్లను బాగానే నిర్వహిస్తుంది.
 
సినిమా వార్త లేదంటే వార్త ఛానల్‌కు కిక్ ఉండదనుకుంటారో ఏమో! ప్రతిరోజూ సినిమా వార్తను హెడ్‌లైన్స్‌లో పెట్టడమో.. వార్తల సమాహారాన్ని రూపొందించడంమో.. గ్యాసిప్ కబుర్లతో ప్రేక్షకులను వేడెక్కించడమో చేస్తూ వుంటాయి ఛానల్స్. శృతిమించిన వ్యాఖ్యానాలతో సినిమా వారిపై కామెంట్స్‌ని గ్యాసిప్స్ రూపంలో చెప్పేస్తూ వార్తా ఛానళ్లు రేటింగ్ పెంచుకోవాలని చూడటంలో వెండి తెర బాగానే ఉపయోగపడుతుంది. ‘వర్మ’ లాంటి డైరెక్టర్ సినిమా రిలీజ్ అంటే న్యూస్ మీడియాకు పండుగే. కాంట్రవర్సీలతో రోజుల తరబడి ఆ వార్త నడుస్తూనే ఉంటుంది.
మహిళల్లో 80 శాతం థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం మానేశారు. మిగతా 20 శాతంలో కూడా సినిమా బావుందని వౌత్‌టాక్ అదిరితేనే సినిమాకు వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా టార్గెట్ యూత్‌గా మారింది. లవ్, సెక్స్, క్రైం వంటి కథనాలతోనే ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయి. అందుకే సక్సెస్ రేటు పడిపోయి నూటికి ఒకటీ అరా విజయాలే కనిపిస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు కూడా బావుంటేనే ఆడుతున్నాయి. లేకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌కి వచ్చేస్తున్నాయి. మూడు పూటలా సినిమాలు వేసే ఛానల్స్ వారు కూడా పాత సినిమాల కంటే కొత్త సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే ఛానల్ రేటింగ్ దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పోటీ పడి కొత్త సినిమాల శాటిలైట్ రైట్స్ దక్కించుకోవాల్సి వస్తుంది. దూరదర్శన్ ఉన్నప్పుడు నిర్మాత ఫలానా సినిమా ప్రదర్శనకు ఇస్తానని అప్లికేషన్ పెట్టుకుంటే వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుని ఛానల్ వారు వారానికి ఒకటిగా ప్రసారం చేసేవారు. దానికి తగ్గ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఆ టైమ్‌లో నిర్మాతలు కూడా తమ సినిమాలకు రిపీట్ రన్ థియేటర్లలో వుండటం వల్ల ఛానల్‌కి ఇవ్వాలంటే ఇష్టపడేవారు కాదు. పైగా ఛానల్స్‌లో సినిమా వచ్చిందంటే ఇక అంతే! అనే పరిస్థితి. ప్రస్తుతం రిపీట్ రన్ అనేది ఊహలో కూడా లేదు. అదీగాక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ పోటీ పడి మరీ సినిమాలు కొనడానికి సిద్ధపడటంతో నిర్మాత అడిగినంత రేటును దక్కించుకుంటూ హ్యాపీగా అమ్మేస్తున్నాడు. శాటిలైట్ రైట్స్ కూడా ఈనాడు సినిమాకు మంచి బిజినెస్ మార్కెట్‌ని ఇస్తున్నాయి. బుల్లితెర విపరీతంగా వెండితెరను నష్టపరిచినా హిట్ సాధించిన సినిమాలు మాత్రం ఇటు వెండితెరపైనా అటు బుల్లితెరపైనా బాగానే బిజినెస్ చేసుకుంటున్నాయి. ఫర్వాలేదనిపించుకునే సినిమాలకు బుల్లితెర రైట్స్ కొంతవరకు ఊపిరి పోస్తున్నాయనే చెప్పాలి.

www.andhrabhoomi.net

Friday, December 17, 2010

Maa TV Network to launch Maa Junior and Maa Movies

Maa Television Network Ltd is gearing up to launch two new channels – Maa Junior for kids and Maa Movies. These new channels will be launched by the end of December this year or early January 2011. Maa Television Network currently has in its stable Telugu entertainment channel Maa TV and music channel Maa Music.

Speaking on the development, Sharrath Marar, Director & CEO, Maa Television Network Ltd, said, “We are looking at launching the two channels soon, but would like to talk in detail about those closer to the launch date.”

He, however, did add, “We do see an opportunity in the Telugu kids’ entertainment genre. There are not many players in this space and majority are international players. Maa Junior will have a mix of indigenous content and dubbed international shows. For Maa Movies, traditionally we have had an impressive catalogue of movies and we will leverage those for our movie channel, besides creating new line-up.”

Source: www.exchange4media.com