Wednesday, July 28, 2010

మోహన్ బాబు సొంత టీవీ ఛానల్ యత్నాలు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు న్యూస్ ఛానల్ పెట్టాలకుంటున్నట్టు సమాచారం. దీనిపై టీవీ జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. న్యూస్ ఛానల్ తో పాటు ఒక ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ప్రారంభించాలని ఆయన ఉద్దేశంగా కన్పిస్తోంది. టీవీ రంగంలో తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న బాగా రాణించడంతో ఈ రెండు టీవీ ఛానళ్ళ బాధ్యతను ఆమెకు అప్పగించాలన్నది ఆయన ఆలోచన. మోహన్ బాబుకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. విద్యా వ్యాపారంలో ఆయన బాగా రాణించారు.

మోహన్ బాబు కుమారుడు విష్ణుకు థింక్ స్మార్ట్ అనే గ్రాఫిక్స్ స్టూడియో ఉంది. ఆ స్టూడియో టీవీ ఛానళ్ళకు సపోర్టివ్ గా ఉంటుంది. కొత్తగా న్యూస్ ఛానల్స్ కు అనుమతి ఇవ్వకూడదని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే మోహన్ బాబు నష్టాల్లో ఉండి జీతాలు ఇవ్వలేకపోతున్న ఏదైనా ఒక ఛానల్ ను టేకోవర్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాదలుచుకున్న మోహన్ బాబుకు న్యూస్ ఛానల్ మీద మంచి ఆసక్తి ఉంది.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment