Friday, June 25, 2010

అగ్రి గోల్డ్ వారి RK-news: రూపు మారనున్న జెమిని-న్యూస్

చాలా ఏళ్ళుగా పలు రంగాలలో వ్యాపారం చేస్తూ స్థిరపడి మంచి బ్రాండ్ నేం సాధించిన 'అగ్రి గోల్డ్' సంస్థ ఇప్పుడు సమాచార రంగంలోకి అడుగుపెట్టబోతున్నది. ఆగస్టు 15 న RK-న్యూస్ పేరిట ఉపగ్రహ ఛానల్ ను ఆరంభిస్తున్నది. ఈ పేరిట ఇప్పటి వరకు కేబుల్ టీ.వీ.నడుస్తున్నది.
 
మూతపడిన ఒక ఛానల్ లైసెన్స్ తో అగ్రి గోల్డ్ వారు రంగప్రవేశం చేస్తున్నారు. ఇందుకోసం బిర్లా ప్లానిటోరియం ప్రాంగణంలో ఒక ఆఫీసు అద్దెకు తీసుకుని ఆపరేషన్ ఆరంభించారు. సిబ్బంది నియామకం కూడా ఆరంభించినట్లు సమాచారం. 'సాక్షి' ఛానల్ లో అన్నయ్య తీరు భరించలేక బైటికి వచ్చిన ఒక సీనియర్ జర్నలిస్టు ఇందులో చేరుతున్నట్లు తెలిసింది. 

విజయవాడ దగ్గర 'హాయ్..లాండ్' పేరిట ఆగ్రి గోల్డ్ ఇటీవలనే ఒక భారీ వెంచర్ దిగ్విజయంగా ఆరంభించింది. ఈ మీడియా వెంచర్ వెనుక ఎవరు ఉన్నదీ, ఉద్దేశాలు ఏమిటీ తెలియాల్సివుంది.   
మరొక పక్క జెమిని ఛానల్ వారు న్యూస్ ను మరింత పకడ్బందీగా తేవాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా దాదాపు పది కోట్ల విలువ చేసే ఆధునిక పరికరాలు తెప్పించారు. కీలక పదవుల్లోకి సీనియర్లను తీసుకోవాలని భావిస్తున్నారు. 

TV-9 లో ఇన్ పుట్ ఎడిటర్ స్థానం లో ఉండి...తాజా బదిలీలలో నేషనల్ కో ఆర్డినేటర్ అయిన దినేష్ ను తీసుకోవాలని జెమిని యాజమాన్యం భావిస్తున్నది. రవి ప్రకాష్ తో తన తాజా సంబంధాల నేపథ్యంలో దినేష్ ఈ బాధ్యతను స్వీకరించవచ్చని అనుకుంటున్నారు.  

Source: apmediakaburlu.blogspot.com

No comments:

Post a Comment