Tuesday, March 1, 2011

క్రికెట్ ఫీవర్

క్రికెట్ మాటేమోగానీ - కొన్నాళ్ల క్రితం ‘మందిర’ తన ‘స్ట్రాప్’ అందాలతో జనాన్ని ఉర్రూతలూగించి ‘సెంచరీ’ చేసేసి ఆనక బోలెడన్ని ప్రశంసలూ కొట్టేసింది. వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఛానెళ్లూ క్రికెట్ అనుభవజ్ఞుల చేత చర్చాగోష్ఠులు నిర్వహించటం షరా మామూలే. ఫలానా ‘సచ్చినోడు’ సెంచరీ కొట్టేస్తాడా? పిచ్ బాగుంటే ఎన్ని బౌన్సర్లు పడతాయి? లేకుంటే ఎన్ని సిక్సర్లు పేల్తాయి? లాంటి చచ్చు ప్రశ్నలతో జనాన్ని ఠీవీకి కట్టి పడేయటం తెలిసిందే. ఐతే - ఆ పంథాని ఎంచక్కా మార్చేసి దేనికైనా ‘కమర్షియల్’ కిక్ లేందే జనానికి నచ్చదన్న సిద్ధాంతాన్ని వొంటబట్టించుకున్న ఇండియా టీవీ సరికొత్త తరహాలో ‘క్రికెట్’ చర్చాగోష్ఠినీ, వరల్డ్ కప్ వండర్లనూ తెర కెక్కించేందుకు ఐటెం గర్ల్ అలియాస్ హాట్‌హాట్ గర్ల్ రాఖీ సావంత్‌నీ, ‘బిగ్ బాస్’తో బోలెడంత క్రేజ్‌ని దక్కించుకున్న పాకిస్తానీ నటి వీణా మాలిక్‌లను ఆహ్వానించింది.

అంతేకాదు - ఆసక్తికరమైన బహుమతులూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో 12 మంది అభ్యర్థులు రెండు గ్రూపులుగా విడిపోతారు. తమ తమ అభిమాన క్రీడాకారులు ఎన్ని పరుగులు తీస్తారు? ఎన్ని క్యాచ్‌లు పడతారు? క్యాచ్‌లు మిస్ చేస్తారు? ఇత్యాది పలు అంశాలపై ‘బెట్’ కట్టవచ్చు. దీంట్లో మాగ్జిమమ్ పాయింట్స్‌ని స్కోర్ చేస్తే ‘హోండా కారు’ గెలుచుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో రాఖీ సావంత్, వీణా మాలిక్‌లే కాదు - యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్, గాయకులు శంకర్ షెహనాయ్, అశోక్ మస్తీ, బ్యూటీషియన్లు సిల్వియా, ఆర్.జె.సిమ్రాన్.. కూడా కనిపిస్తారు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment