Tuesday, November 23, 2010

జీ తెలుగులో 'పసుపు--కుంకుమ'

అమ్మానాన్న, తమ్ముడు...ఇదే ప్రపంచంగా భావించే ఓ అమ్మాయి జీవితం విధి బలీయంతో ఎలాంటి తీరాలకు చేరింది. పసుపు, కుంకుమలకు విలువనిస్తూ, సంప్రదాయాల్నీ, సంస్కృతిని పరిరక్షిస్తూ తనవారి కోసం పాటుపడే ఆ మహిళ ఇతివృత్తమే 'పసుపు-కుంకుమ' సీరియల్‌. జీతెలుగు టీవీ, అన్నపూర్ణా స్టూడియోస్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ మెగా డైలీ సీరియల్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7-30 గంటలకు ప్రసారమవుతోంది.

ఈ సందర్భంగా సీరియల్‌ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, 'ఓ చక్కటి కుటుంబ కథతో రూపొందిస్తున్న ఈ సీరియల్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. ఎన్నో జీవితాల మలుపులను ఇందులో చూడవచ్చు' అని చెప్పగా, ప్రతి మహిళకు నచ్చే, మెచ్చే ఎన్నో అంశాలు ఈ సీరియల్‌లో ఉన్నాయని జీ తెలుగు బిజినెస్‌ హెడ్‌ జి.అనురాధ తెలిపారు.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment