Friday, August 23, 2013

ఫోన్ల కోసమే ఓ చానల్

ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లలో వీక్షించేవిధంగా 'వీ4యు' అనే చానల్‌ను తిరువనంతపురానికి చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుల బృందం ప్రారంభించింది. దేశంలో ఈ తరహా చానల్‌ను తొలిసారి ప్రారంభిస్తున్నట్లు, ప్రపంచంలో ఎక్కడ నుం చైనా 2జీ, 3జీ మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో ఈ ఛానల్‌ను వీక్షించవచ్చని చానల్ ప్రారంభకుల్లో ఒకరైన జీఎస్ అరవింద్ పేర్కొన్నారు. టీవీల్లో మినహా కంప్యూటర్లు, ఐప్యాడ్‌లు, ట్యాబ్లెట్లలో జావా, ఆండ్రాయిడ్ ఏ ఆపరేటింగ్ సిస్టంల్లో నైనా ఈ చానల్‌ను 24 గంటలూ వీక్షించవచ్చన్నారు.

Source: www.andhrajyothy.com

No comments:

Post a Comment