Wednesday, August 28, 2013

టీవీ9 గ్రూప్ ను కొనేందుకు సన్ టీవీ యత్నాలు!

దక్షిణ భారత దేశంలో అతిపెద్ద టెలివిజన్‌ నెట్‌వర్క్‌గా ఉన్న సన్‌ టీవీ.. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పని చేస్తున్న టీవీ9 గ్రూపును కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. 150 కోట్ల రూపాయలు చెల్లించి టీవీ9ను కొనుగోలు చేసే అవకాశాలున్నాయని బిజినెస్‌లైన్‌ అనే వ్యాపార దినపత్రిక ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం టీవీ9 గ్రూపులో ఆరు ఛానెళ్లు ఉన్నాయి. మారిషస్‌ కేంద్రంగా పని చేస్తున్న సైఫ్‌ పార్టనర్స్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థకు ఈ గ్రూపులో గణనీయంగా వాటా ఉంది. ఈ వాటాను అమ్మేయాలని సైఫ్‌ పార్టనర్స్‌ భావిస్తోంది. సౌత్‌ ఇండియాలో సన్‌ టీవీకి 32 ఛానెళ్లు ఉన్నాయి.

Source: teluguupdates.com

No comments:

Post a Comment