Tuesday, May 3, 2011

మా సీరియల్‌ బంగారం

బాలాజీ టెలిఫిలింస్‌ పతాకంపై జెమినీ టీవీలో ప్రతిరోజు ప్రసారం చేస్తున్న 'కొత్త బంగారం' సీరియల్‌ 300 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బాలాజీ టెలిఫిలిం సౌత్‌ హెడ్‌ సెమికర్ణ మాట్లాడుతూ... 'సన్‌ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జెమినీ టీవీ హెడ్‌ సంజరురెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సీరియల్‌ క్రియేటివ్‌ హెడ్‌ ఉప్పలపాటి నారాయణరావు సహకారంతో ఈ సీరియల్‌ను తీర్చిదిద్దాం. ఈ సీరియల్‌ విజయవంతమయింది. దానికి కారణం మంచి కథ, కథనం. నాణ్యత రీత్యా సీరియల్‌ను తీర్చిదిద్దాం. బాలీవుడ్‌లోనైనా టాలీవుడ్‌లోనైనా నేటివిటీ కొంచెం మార్పు రీత్యా కథలు ఒకేలా ఉంటాయి. మన దేశ సంప్రదాయాలు, మన సంస్కృతులు ప్రధానంగా స్టోరీ ఉండేట్టు చూసుకుంటాం. భాషలు వేరైనా జీవన విధానం ఒక్కటే. కాబట్టి సీరియల్‌ ఏ భాషలో తీసినా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముంది' అని చెప్పారు.


ఉప్పలపాటి నారాయణరావు మాట్లాడుతూ...'మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 300వ ఎపిసోడ్‌ వరకు కార్తీక్‌ దర్శకుడిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ దర్శకుడిగా చేస్తున్నాడు. మధుశ్రీ స్క్రీన్‌ప్లే సహకారం బాగుంది' అని అన్నారు. రచయిత మధుశ్రీ మాట్లాడుతూ...'180 ఎపిసోడ్స్‌ వరకు సంభాషణలు రాశాను. టెలిప్లేకు కూడా సహకరిస్తున్నాను. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు సీరియల్స్‌లలో చోటు సంపాదించటం ఆనందంగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు ప్రభాకర్‌, ప్రేమ తదితరులు మాట్లాడారు. 
Source: www.prajasakti.com

No comments:

Post a Comment