Monday, May 30, 2011

శతాబ్ది రైళ్లలో టెలివిజన్

శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు వాల్యూ యాడెడ్ సర్వీపుల కింద ప్రయాణికులకు టిలిజన్ సదుపాయం కలిగించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది.

ఇప్పటికే ఒక శతాబ్ది రైలులోప్రయోగాత్మంగా అమలు చేయగా, దానికి మంచి స్పందన ప్రయాణికులలో కనిపించడంతో ముందుగా అరడజను శతాబ్ది రైళ్లలో టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్జిక్యూటివ్ క్లాస్ లో, ఎసి ఛైర్ కార్ లలో ప్రతి సీటు వెనుక పది అంగుళాల సైజు ఉన్న ఎల్ సిడి టివి అమర్చుతారు. వార్తా ఛానళ్లు, క్రీడల ఛానళ్లు అందుబాటులో ఉండే విదంగా సర్వీస్ ప్రొవైడర్ల కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు సంవత్సరానికి పదమూడు నుంచి పద్దెనిమిది లక్షల వ్యయం అవుతుందని అంచనా, అయితే టివీ సర్వీస్ స్కీమ్ ద్వారా సంవత్సరానికి ఒక సీటు ద్వారా ఇరవై ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతానికి అమృతసర్, కల్క, లక్నో, భోపాల్, అజ్మీర్, డెహ్రాడూన్ లకు వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఈ టివీ స్కీమ్ ను అమలు చేయబోతున్నారు. 

Source: kommineni.info

No comments:

Post a Comment