Monday, May 23, 2011

త్వరలో ఏర్పాటు కానున్న టీవీ సెన్సార్ బోర్డ్

ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ చానెళ్లను మరింతగా పర్యవేక్షించడానికి త్వరలో సెన్సార్ బోర్డ్ ఏర్పాటు కానుంది. ఈ మధ్య కాలంలో అనేక చానెళ్లలో వస్తున్న రియాలిటీ షో లు వివాదాస్పదం కావడం, అధికంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి టీవీ చానెళ్ల మధ్య పెరుగుతున్న పోటీని పర్యవేక్షించడానికి సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది.

హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ ప్రవేశించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తరువాత అసభ్యత ను ప్రోత్సహిస్తున్న రియాలిటీషో లపై సెన్సారింగ్ ఉండాలనే డిమాండ్ అధికంగా వుంది. ఈ విధమైన అనేక షో లను గమనించిన తరువాతే ప్రత్యేకంగా ఒక బోర్డు ఆవశ్యకతను గుర్తించారు.

ఈ కమిటీలో అన్ని చానెళ్ల ప్రతినిధులకు అవకాశం కల్పించి, వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఒకసారి బోర్డు ఏర్పాటు జరిగిన తరువాత ఆ సూచనలను అతిక్రమించకుండా పాటించాల్సిన బాధ్యత చానెళ్లదే.   

Source: www.tollywoodsite.com

No comments:

Post a Comment