Monday, May 23, 2011

మీడియాపై మంత్రి తోట ధ్వజం

రాష్ట్ర మంత్రి తోట నరసింహం ఎన్నడూ లేని విధంగా మీడియాపై ధ్వజమెత్తారు. ఆయన పిఠాపురంలో శనివారం రాజీవ్ వర్థంతి సందర్భంగా ఈ చర్యకు పాల్పడ్డారు. విలేఖరులతో మాట్లాడుతూ తాను ఇటీవలి పరిణామాలతో పేపరు చదవడం మానేశానని, టీవీ ఛానళ్ళు కూడా చూడటం లేదని చెప్పారు. దీంతో స్థానిక నేతలు ఆశ్చర్యపోతుండగా ఆయన మాట్లాడుతూ ఓ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ లోగోనూ చూస్తూ ఆయన ఆవేశంతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. సదరు ఛానల్ వారు ఎసి రూముల్లో కూర్చుని, ఏవేవో సృష్టించి వార్తలు ప్రసారం చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల మంత్రిని సదరు ఛానల్ గోడమీద పిల్లి వాటంగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ మంత్రి ఈ విధంగా ఆగ్రహించినట్టు స్థానిక కార్యకర్తలు చెవులు కొరుక్కున్నారు. ఆ సమయంలోనే మరో పత్రిక విలేఖరి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో కోవర్టుల పాత్రను ప్రస్తావించగా తాను పూర్తిగా పేపర్లు చదవటం మానేశానని, ఇది ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

 

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment