Friday, July 15, 2011

మంచు లక్ష్మి ప్రసన్న 'ఎన్ టీవి' పై మండిపాటు

మంచు లక్ష్మి ప్రసన్న తాజాగా ట్విట్టర్ లో 'ఎన్ టీవి' లో వచ్చిన స్క్రీలింగ్ కి కౌంటర్ చేస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో...ఎన్ టీవీ స్క్రోలింగ్ లో వచ్చిన మోహన్ బాబు, రామ్ చరణ్ ల ఆర్గుమెంట్ రబ్బిష్. నాన్న మీడియా ఇలాంటి వార్తలు ప్రసారం చేయటంపై చాలా కోప్పడ్డారు. అంతేకాదు చరణ్ నాన్నకు మంచి స్నేహితుడు, కొడుకు లాంటి వాడు వాడు. కాబట్టి ఆర్గుమెంట్ జరిగిందనేది నమ్మొద్దు అని ట్వీట్ చేసింది. ఇక రామ్ చరణ్ కీ, దాసరికి మధ్య జరిగుతున్న కోల్డ్ వార్ లో మోహన్ బాబు తల దూర్చి తన గురువు కి సహాయం చేసాడన్న రీతిలో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ టీవీ ఛానెల్ ఈ విషయమై మోహన్ బాబు రామ్ చరణ్ ని తిట్టాడంటూ స్కోరింగ్ ప్రసారం చేసింది. అయితే ఆ అత్యుత్సాహానికి మోహన్ బాబు కూతురు లక్ష్మి ప్రసన్న ఇలా అడ్డు కట్ట వేసింది.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment