Thursday, July 28, 2011

త్వరలో పత్రిక, న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తా: జగ్గారెడ్డి

సామాజిక తెలంగాణ లక్ష్యంగా దోపిడీదారుల పాలన పోవాలని మీడియా రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(కాంగ్రెస్‌) వెల్లడించారు. బుధవారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మరి కొద్ది రోజుల్లో 'జై తెలంగాణ జై' పేరుతో దినపత్రిక, టీవీ న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ పేరు మీద వంద కోట్ల రూపాయలను పోగుచేసి వాటిని కుటుంబ ఆస్తులుగా కూడబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య తెలంగాణ పేరు మీద వచ్చిన ఒక దినపత్రిక, టీవీ ఛానెల్‌ కేవలం బ్లాక్‌ మెయిలింగ్‌కే పరిమితమై, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడవడం చూసి తానెంతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అందుకే పత్రిక, న్యూస్‌ ఛానెల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

Source: www.eenadu.net

1 comment:

  1. Hi we seen your blog it’s quite interesting please visit our blog kalahastikalavahini.blogspot.com it also matter something – Thank you

    ReplyDelete