Monday, July 4, 2011

‘సీమాంధ్ర టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయాలి’

తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్న సీమాంధ్ర టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ఛానళ్ల లోగోలను న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఖని ప్రధాన చౌరస్తాలో ధ్వంసం చేశారు. కొంత కాలంగా సీమాంధ్ర టీవీ ఛానళ్లు తెలంగాణ ఉద్యమంపై విష ప్రచారం చేస్తూ, ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ప్రసారం చేశాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రజావూపతినిధులు తీసుకున్న రాజీనామా నిర్ణయాలను తప్పుగా చూపుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న ఆయా ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయాలని ఎంఎస్‌ఓలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు కె వి.అశోక్, విక్రంసింగ్, పుట్ట రాజన్న, పటేల్, సంపత్, అనిల్, రఘు, శ్యామ్, శ్రీనివాస్, అరుణ్, అంజయ్య, జనగామ తిరుపతి పాల్గొన్నారు.

Source: www.namasthetelangaana.com

No comments:

Post a Comment