Wednesday, July 13, 2011

వీక్షకుల తీర్పు

హాయిని గొలిపే..
ప్రతి సోమవారం రాత్రి 9.30 ని.లకు ప్రసారమవుతున్న ‘పాడుతా తీయగా..’ ఎంతో హాయిని గొలుపుతోంది. అంతా తానై అన్నిటా తానై స్వరాల తప్పొప్పులను సరిచేస్తూ చిరుగళాల సంగీత సాహిత్య విన్యాసాలకు ఆలంబనగా నిలుస్తూ బాలు ఈ కార్యక్రమాన్ని రంజింపజేస్తున్నారు. ఎవరినీ ఎక్కడా నొప్పించకుండా కార్యక్రమాన్ని రక్తి కట్టించే విధానం బాగుంటోంది. కొత్త టెండర్లను పిలుస్తున్నారు. సంతోషం. ఈ సిరీస్‌లో అయినా అన్నీ కొత్త ముఖాలు, కొత్త గళాలు, కొత్త ప్రయత్నాలు సాగుతాయని ఆశిస్తున్నాం. వచ్చే సిరీస్‌లో సీనియర్లను ఆపి అంతా జూనియర్లతో సంగీత యుద్ధం చేయిస్తే చూడాలని ఉంది.
-కొంగర ఉమామహేశ్వరరావు (చెంచుపేట)

ఒకే ఒక్క ఛానల్
ఛానల్ పేరుతోపాటుగా ‘తెలుగు’ అని అక్షరాలలో వేసే ఒకే ఒక్క ఛానల్ ‘జీ తెలుగు’ ఛానల్ మాత్రమే. వీరిదే అయిన జీ వార్తా ఛానల్ పేరుతోపాటుగా ‘24 గంటలు’ అని తెలుగు అక్షరాలలో వేస్తున్నారు. జీ ఛానల్ యాజమాన్యం తెలుగు వారిది కాకపోయినా ‘తెలుగు’ అని పేర్కొంటున్నారు. కాని తెలుగువారి యాజమాన్యాలలో ఉన్న తెలుగు ఛానెళ్ల లోగోలతోపాటు ‘తెలుగు’ అని పేర్కొనే ఛానల్ ఒక్కటి కూడా లేదు. 
-ఎన్.మధుసూదనరావు (హైదరాబాద్)

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment