Tuesday, December 28, 2010

జనవరి 3 నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ‘అపరంజి’

నాగబాబు, మంజు భార్గవి, జయలలిత, సుహాసిని, నవభారత్ ప్రధాన పాత్రధారులుగా హరిప్రసాద్ దర్శకత్వంలో విజన్ టైం ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వైదేహి రామ్మూర్తి నిర్మిస్తున్న ‘అపరంజి’ డైలీ సీరియల్ జనవరి 3 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ - ఇప్పటివరకు 130 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 6.30 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ కథాబలం ఉండటంవల్ల, కాస్టింగ్ వల్ల క్వాలిటీతో నిర్మించటంవల్ల ఇంతవరకు ఎప్పుడూ రాని హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. తెలుగుదనం ఉన్న సీరియల్ ఇది. ప్రేక్షకులకు మరింత చేరువ కావటానికి జనవరి 3 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. ఇదే సీరియల్‌ని మొదట తమిళంలో ‘తంగం’ పేరుతో రూపొందిస్తున్నారు. జనవరి 10 నుంచి ఈ సీరియల్‌పై ‘క్విజ్’ని ఏర్పాటు చేయనున్నారు. క్విజ్‌లో గెలుపొందిన మహిళలకు ప్రతి వారం ‘టూ వీలర్’ని అందించనున్నారు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment