Friday, December 24, 2010

బుల్లితెరపై వెండితెర సినిమాకు శ్రీకారం

జంగారెడ్డిగూడెం: బుల్లితెరపై వెండితెర సినిమా చూపించేందుకు ఆద్రి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ సరికొత్త ప్రయోగానికి గురువారం శ్రీకారం చుట్టింది. స్థానిక గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో త్వరలో రానున్న ఆద్రి ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ వెండి తెర క్వాలిటీతో చూపించే సినిమా షూటింగ్ ప్రారంభించింది. ఆద్రి మినీ బ్లాక్ బస్టర్ మూవీస్ పేరుతో సినిమాలను రూపొందిస్తున్నట్టు ఆద్రి క్రియేటివ్ టీం తెలిపింది. దీనిలో భాగంగా మొట్టమొదటిసారిగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేదికగా సినిమా రూపొందిస్తున్నట్టు తెలిపింది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర సన్నివేశాలను దేవీపట్నం, పోలవరం, పట్టిసీమ, బుట్టాయగూడెం తదితర ప్రాంతాలలో చిత్రీకరిస్తామని తెలిపింది. ఇటువంటి చిత్రం తమ కళాశాలలో రూపొందించడం సంతోషమని షూటింగ్‌ను ప్రారంభించిన గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ చిట్టూరి గణేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి దశరథ్, చిత్ర దర్శకుడు బి.ఎన్.రెడ్డి, నటీ నటులు జ్యోతిశ్రీతేజ్, సుభాష్, శే్వత, ఉష, జాహ్నవి, సోగ్గాడు శ్రీను, మూవీ మేనేజర్ తిరుమల యాళ్ళ తదితరులు పాల్గొన్నారు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment