Tuesday, January 4, 2011

‘తారక్.. ఉల్టా ఛెష్మా’ 500 ఎపిసోడ్లు పూర్తి

రెండున్నరేళ్లుగా ప్రేక్షకుల్ని నవ్వుల వానలో ముంచెత్తుతున్న ఆసిత్ మోడీ కామెడీ సీరియల్ ‘తారక్ మెహతా కా ఉల్టా ఛెష్మా’ ఇటీవల 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ‘డైలీ’ సీరియళ్ల టిఆర్‌పి రేటింగ్‌తో పోటీ పడుతోంది. గత సంవత్సరం టాప్ టెన్ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో ముందంజ వేసింది. ‘సబ్’ టీవీలో 8.30 స్లాట్‌లో ధారావాహికంగా వస్తోన్న ఈ సీరియల్ ఎంతో జనాదరణ పొందిన గుజరాతీ దినపత్రిక ‘కాలమ్’. ఒక హౌసింగ్ కాలనీ. వివిధ మతాల కులాల వాళ్లు. వారి మధ్య సాగిన మాటా మంతీ. ఈ సీరియల్‌లో దిలీప్ జోషి ప్రధాన పాత్ర పోషించాడు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment