Friday, January 28, 2011

సినీ నటి రోజాను టార్గెట్ చేసిన లోకేష్ చానెల్ స్టూడియో ఎన్

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ దారి పట్టిన సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు చెందిన స్టూడియోఎన్  టీవీ చానెల్ టార్గెట్ చేసుకుంది. ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై రోజా ప్రశంసల జల్లు కురిపిస్తున్న నేపథ్యంలో స్టూడియోఎన్ ఆ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.

తెలుగుదేశం అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో రోజా వైయస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బెల్టు షాపులపై సమరభేరీ సాగించారు. ఆ సమరభేరీలో రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను, ఇప్పుడు చేస్తున్న ప్రశంసలను ఎత్తిచూపుతూ రోజాను లక్ష్యంగా చేసుకుంది. ఆమె ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపే ఉద్దేశంతో ఆ వార్తాకథనాన్ని స్టూడియోఎన్ ప్రసారం చేసింది. బెల్టు షాపుల విషయంలో తన అభ్యంతరాలను వైయస్‌కు చెప్పానని, తన అభ్యంతరాలను వైయస్ స్వీకరించారని రోజా మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment