Friday, January 28, 2011

మీడియాకు సారీ చెప్పిన "మిరపకాయ్" తమ్ముళ్లు

డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రవితేజ సోదరులు బుధవారంనాడు మీడియాపై చిందులు వేశారు. బండబూతులు తిట్టి హంగామా చేశారు. ముఖ్యంగా భరత్ మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు.
దీనిపై మీడియా మండిపడింది. క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేసింది. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించింది. దీంతో రవితేజ తమ్ముళ్లు గురువారంనాడు మీడియా ముందుకు వచ్చారు. మీడియాకు క్షమాపణలు చెప్పారు.
క్షమాపణలు చెప్పిన తర్వాత రవితేజ తమ్ముడు భరత్ మాట్లాడుతూ... అదో చెత్త కేసు. పోలీసులు మాపై కేసు పెట్టారు. దానికి సంబంధించి మేము వెళుతున్నాం. అసలే చెత్త కేసు అనుకుంటే మధ్యలో మీరొచ్చి మాపై కెమెరాలు పెడితే ఎలా ఉంటది. మండుద్ది. అందుకే అలా అనాల్సి వచ్చింది" అంటూ ముక్తాయించారు.

Source: telugu.webdunia.com

No comments:

Post a Comment