Monday, January 3, 2011

బొబ్బిలిలో మాటీవీ యాంకర్‌ శ్యామల హల్‌చల్‌

బొబ్బిలిరూరల్‌, మేజర్‌న్యూస్‌:- గురువారం పట్టణంలో మాటీవి యాంకర్‌, ప్రముఖ టివి ఆర్టిస్ట్‌ శ్యామల సందడి చేశారు. ఆమె మన ఊరు వంట కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న సందర్భంలో పట్టణానికి చెందిన రత్నాల కాశీవిశ్వనాధచౌదరి ఇంట్లో మాటీవి యూనిట్‌ పుణ్యవతమ్మ గృహిణి తయారు చేసిన జున్నుతో కక్రాలు అనే కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఈ విషయం తెలిసిన యువకులు, మహిళలు ఆమెను ఎగబడ్డారు. కాలేజీ రోడ్డంతా జనాలతో నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆమె మేజర్‌న్యూస్‌తో మాట్లాడుతూ ప్రస్తుతం మాటీవిలో మాఊరి వంట యాంకర్‌గా పని చేస్తున్నానని అదే విధంగా గోరింటాకు సీరియల్‌ ప్రస్తుతం జెమిని ఛానల్‌లో ప్రసారం అవుతుందని, దానిలో తన పాత్రకు మంచిపేరు వచ్చిందన్నారు. ఆకాశగంగ, అపరంజి, మొదలగు సీరియల్స్‌లో నటిస్తున్నానని ఇంకా నాలుగైదు సీరియల్స్‌లో నటించేందుకు అంగీకరించినట్లు ఆమె తెలిపారు. అయితే మావూరి వంట కార్యక్రమం ద్వారా మంచి ప్రాచుర్యం లభించినట్లు ఆమె తెలిపారు. 

Source: www.suryaa.com

No comments:

Post a Comment