Sunday, June 5, 2011

త్వరలో చిరంజీవి చానల్‌..

త్వరలో సమైక్యవాది చిరంజీవి చానల్‌ తెస్తున్నడు. లైసెన్స్‌ కోసం ఢిల్లీలో భారీగా లాబీయింగ్‌ చేస్తున్నడట. రెండు నెలల్లో చానల్‌ లాంచ్‌ అవుతుదని టాక్‌ వినిపిస్తుంది. అందుకోసం రిక్రూట్‌మెంట్ కూడా మొదలు పెట్టిన్రట. సాక్షిలో పనిచేస్తున్న స్వప్నను సీఈవో జాయిన్‌ చేసుకుంటరని జర్నలిస్టుల్లో భీకర చర్చ జరుగుతున్నది. జగన్‌ భార్య భారతితో మంచి సంబంధాలున్న స్వప్న చిరంజీవి చానల్‌కు పోయే అవకాశాలు లేవని మరో టాక్‌. అయితే టీవీ9తో మంచి సంబంధాలున్నప్పటికీ సాక్షికి వెళ్లిన స్వప్న చిరంజీవి చానల్‌కు వెళ్తే ఆశ్చర్యపోనక్కరలేదని ఇంకొందరు అంటున్నరు. మరోవైపు ఏబీన్‌ ఆంధ్రజ్యోతి నుంచి బయటకు వెళ్లిన మూర్తి చిరంజీవి చానల్‌ చేరుతున్నరని గుసగుసలు వినిపిస్తున్నయి. చానల్‌ వచ్చేదెంతో పోయేదెంత తెల్వదు కానీ ప్రచారమైతే మగధీర సినిమా కన్నా హైలెవల్‌లో అవుతుంది.

Source: www.porutelangana.com

No comments:

Post a Comment