Monday, June 20, 2011

బాలకృష్ణ, కాజల్ కి మాటీవీ అవార్డులు

తెలుగులో పాప్యులర్ టీవీ చానెల్ మాటీవీ గత సంవత్సరానికి సినిమా అవార్డులను ప్రదానం చేసింది. ‘లక్స్ శాండిల్ సినిమా అవార్డ్స్’ పేరిట ఈ అవార్డుల వేడుక నిన్న రాత్రి హైదరాబాదు మాదాపూర్ లోని హెచ్.ఐ.సి.సి. ప్రాంగణంలో కన్నుల పండువగా జరిగింది. సింహా చిత్రంలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన బాలకృష్ణ ఉత్తమ నటుడుగా ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఉత్తమ నటిగా ‘బృందావనం’ సినిమాకు గాను కాజల్ అగర్వాల్ తరఫున ఆమె సోదరి నిషా అగర్వాల్ అవార్డు అందుకుంది. ప్రముఖ గాయకుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా ‘మర్యాద రామన్న’, ఉత్తమ దర్శకుడుగా గౌతమ్ మీనన్ (ఏ మాయ చేశావే), ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రెహ్మాన్ (ఏ మాయ చేశావే), ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం (అదుర్స్) అవార్డులు స్వీకరించారు. అల్లు అర్జున్, ప్రియమణి, విమలా రామన్, చార్మి తదితరులు పలు సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. నాగార్జున, రాం చరణ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Source: www.telugubest.com

No comments:

Post a Comment