Thursday, February 10, 2011

ఇక ‘ప్రీతి’ వంతు?!

ప్రీతి కలిగించే అంశాలపై ప్రీతి చూపడం ప్రతివారూ చేస్తూనే ఉంటారు. అదే పంథాలో అందరికీ అందుబాటులో ఉండే ఇంటితెరపై నిత్యం కనిపించే ప్రక్రియను అగ్రనటుడు అమితాబ్ నుంచి అరకొర పాత్రలు వేసే ప్రతి ఆర్టిస్టూ తన టాలెంట్‌ను చూపి ఇతోధిక లబ్ధి పొందారు. ఆ ప్రయత్నంలో తన వంతు ప్రయత్నాన్ని నటి ప్రీతీ జింటా త్వరలో చేస్తోంది. బాలీవుడ్‌లోనే కాక ‘ప్రేమంటే.. ఇదేరా’ అంటూ వెంకటేష్ పక్కన ‘రాజకుమారుడు’లో మహేష్ సరసన మెరిసి తెలుగు వారికీ పరిచితురాలైంది ప్రీతి.
 
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ - అబ్ ఇండియా తోడేగా
త్వరలో కలర్స్ టీవీలో రానున్న ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ - అబ్ ఇండియా తోడేగా’ అన్న కార్యక్రమానికి ప్రీతి వ్యాఖ్యాత్రిగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ రికార్డులను అధిగమించడానికి భారతీయులు చేసే ప్రయత్నాల సమాహారమే ఈ షో ఇతివృత్తం అంటూ నిర్వాహకులు చెప్తున్నారు.

నా భావాలకు దగ్గరగా..

ఏది చేసినా అన్నిట్లోకీ బెస్ట్ దాని కోసం ప్రయత్నించాలనే నా మనస్తత్వానికి సరిపోయే షో ఇది. వ్యక్తిలో నేనేదైనా చేయగలను అన్న పట్టుదలను పెంచే దిశగా ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతిభను చూపడానికి అవకాశమున్న ప్రోగ్రామ్ ఇది అని ప్రీతి బల్లగుద్ది మరీ చెప్తోంది. చూద్దాం.. చిన్నతెరపై ప్రీతి ప్రేక్షకులకు ఏ స్థాయిలో ప్రీతిపాత్రమవుతుందో?!

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment