Sunday, February 13, 2011

కామెడీ షోలో...

 ఒకప్పటి బాలీవుడ్‌ అందాల తార రవీనా టాండన్‌ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.కానీ ఈ తార ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న రియాల్టీ షోలలో కనిపించి సందడిచేస్తున్నారు. త్వరలో ఆమె ఓ టివి ఛానెల్‌లో ప్రసారం అయ్యే కొత్త కామెడీ షోకు జడ్జీగా వ్యవహరించేందుకు సైతం ఒప్పుకోవడం విశేషం. ఈ షోలో ఆమె కిరణ్‌ ఖేర్‌, సొహైల్‌ ఖాన్‌లతో కలిసి పాల్గొననున్నారు. 
 
హిట్‌ సినిమాలు అందాజ్‌ అప్నా అప్నా, దుల్హే రాజా వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తార రవీనా టాండన్‌. ఆమె ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి అభిమానులను అలరించారు. ఇక ఈ తార ప్రస్తుతం బుల్లి తెరపై ప్రసారం అవుతున్న రియాల్టీ షోలలో పాల్గొంటున్నారు.త్వరలో ఆమె ఓ కొత్త కామెడీ షోలో న్యాయనిర్ణేతగా చేసేందుకు ఒప్పుకున్నారు.‘బుల్లితెరపై మరో రియాల్టీ షోకు జడ్జీగా చేసేందుకు ఓకే చెప్పాను. ఈ కామెడీ షో స్టార్‌ ప్లస్‌ కోసం రూపుదిద్దుకుంటుంది. త్వరలో ఈ షో షూటింగ్‌ ప్రారంభమవుతుంది’ అని రవీనా వెల్లడించారు.గతంలో రవీనా రెండు కిడ్స్‌ రియాల్టీ షోలకు జడ్జీగా చేశారు. ఈ షోలతో ఆమె బిజీగా ఉంటున్నారు.

ఒకప్పుడు బాలీవుడ్‌లో అగ్రశ్రేణి హీరోయిన్‌ గా పేరుగాంచిన రవీనా ప్రస్తుతం ఏ సినిమాలకు ఒప్పుకోవడం లేదు. 36 సంవ త్సరాల ఈ అందాల తారకు ఓ కొత్త సినిమాలో చేసేందుకు అవకాశం వచ్చింది. కానీ ఈ విషయంలో ఆమె ఏమీ చెప్పడం లేదని తెలిసింది. కానీ ఆప్‌ కే లియే హమ్‌ చిత్రంలో రవీనా నటించారని సమాచారం. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇక షారూఖ్‌ ఖాన్‌ చిత్రం ‘డాన్‌ 2’లో ఆమె నటించేందుకు ఒప్పు కోలేదు. ‘డాన్‌ 2 చిత్రంలో చేసేందుకు అవకాశం వచ్చింది. కానీ నేను ఒప్పుకోలే దు. ప్రస్తుతం బుల్లితెరపై రియాల్టీ షోలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాను’ అని రవీనా తెలిపారు.ఇక ఢిల్లీలో కొద్ది రోజు ల్లో జరుగబోయే జిఆర్‌8 ఉమెన్స్‌ అఛీవర్స్‌ అవార్డులో ఆమె పాల్గొన నున్నారు.

రవీనా 2006లో విడు దలైన చిత్రం స్యాండ్‌విచ్‌లో చివరి సారిగా ప్రేక్షకులకు దర్శనమిచ్చారు. ఈ చిత్రం ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అటువంటి మంచి చిత్రం తోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటు న్నట్టు చెప్పారు. ‘ఒకప్పుడు సినిమాల్లో అగ్రతారగా వెలుగొందిన నేను మళ్లీ సినీ రంగంలోకి రీ ఎంట్రీ చేయా లని కోరుకుంటున్నాను. మంచి చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాను’ అని నేషనల్‌ అవార్డు విజేత అయిన ఈ తార తెలిపారు. ‘ప్రొడ్యూసర్‌గా చేసిన చిత్రం తో కొంత నష్ట పోయాను. సరైన కథ లేకపోవడం మూలం గా దెబ్బతిన్నాను. దీంతో సినిమా ప్రొడక్షన్‌కు పుల్‌స్టాప్‌ పెట్టాను. తిరిగి నటనలోకి అడుగుపెట్టి సినీతారగా కొనసా గాలని భావిస్తున్నాను’ అని ఆమె తెలిపారు.

ఇక రవీనా తన ఇద్దరు పిల్లలు రషా(5), రణ్‌బీర్‌ (3)మూలంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. పిల్లలే తన ప్రాణమని చెప్పే రవీనా వారి పేరుతో తన శరీ రంపై టాటూలను కూడా ముద్రించుకోవడం విశేషం. ‘పిల్లలు రషా, రణబీర్‌లంటే నాకెంతో ఇష్టం. వారి కోసమే నేను కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాను. పిల్ల లు కొంత పెద్దైన తర్వాత సినిమాల్లోకి మళ్లీ రావాలని అనుకున్నాను. ఇక తీరిక సమయాల్లో పిల్లలిద్దరితో సరదాగా ఆడుతూపాడుతూ ఎంజాయ్‌చేస్తాను’ అని రవీనా అన్నారు.
 
Source: www.suryaa.com

No comments:

Post a Comment