Saturday, February 26, 2011

సోను నిగం జడ్జిగా రియాల్టీషో

సింగింగ్ రియాల్టీషో-‘ది ఎక్స్‌ఫ్యాక్టర్’కు బాలీవుడ్ గాయకుడు సోనునిగం న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. సోనీ టివిలో త్వరలో ఈ షో ప్రారంభంకానుంది. ఐపిఎల్ తర్వాత ఇది ప్రేక్షకులను అలరించనుందని సోనీ టివివర్గాలు తెలిపాయి. ఢిల్లీతో సహా ఏడు నగరాల్లో ఆడిషన్ నిర్వహిస్తారు. ఈ షోను నిర్వహించే ఆదిత్య నారాయణ్ కూడా ఈ నగరాలను సందర్శిస్తారు. 16 నుంచి 25 ఏళ్లవారు, 25 ఏళ్లు దాటిన వారెవరైనా ఇందులో పాల్గొని గానంలో తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. సోనునిగంతో బాటు మరో ఇద్దరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.

Source: medianx.tv

No comments:

Post a Comment