Tuesday, February 15, 2011

విజయవాడ కేంద్రంగా కొత్త న్యూస్ ఛానల్!

ఏ టెలివిజన్ ఛానెల్ అయినా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది. మాజీ జర్నలిస్టు అంకబాబు అనే ఆయన చొరవ తీసుకుని, డబ్బు పోగేసి విజయవాడ కేంద్రంగా త్వరలో ఒక కొత్త న్యూస్ ఛానెల్ తేవాలని భాస్తున్నట్లు సమాచారం. 
 
సీనియర్ జర్నలిస్టు అయిన అంకబాబు 'ఈనాడు' 'ఉదయం' లలో పనిచేసారు. ఆ తర్వాత మాగుంట సుబ్బిరామి రెడ్డి దగ్గర ప్రజా సంబంధాల వ్యవహారాలు చూసారు. ఆ సమయంలో జీవన సత్యాలు తెలుసుకుని ఆయన జీవితంలో పైకి ఎదిగారని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు. ఎనభై నుంచి వంద కోట్ల వ్యయమయ్యే...ఈ ఛానెల్ లాంచింగ్ కోసం ఆయన సీనియర్ జర్నలిస్టులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఛానెల్ పేరు ఇంకా ఖరారు కాలేదు. 
 
Source: apmediakaburlu.blogspot.com

1 comment: