Monday, February 21, 2011

కలైణర్ టివి కార్యాలయంపై సిబిఐ దాడులు

డిఎంకె ఆధ్వర్యంలోని కలైణర్ టివి కార్యాలయంపై సిబిఐ ముమ్మరంగా దాడులు జరిపింది. ఇందులో డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సిఎం కరుణానిధి భార్య ఎం.కె. దాయాలు, కుమార్తె, ఎంపీకూడా అయిన కళిమొని భారీ షేర్‌హోల్డర్లుగా ఉన్నారు. 2 జిస్పెక్ట్రం కేసులో నిందితుడు, స్వాన్ టెలికామ్ ప్రమోటర్ అయిన షాహిద్ ఉస్మాన్ బల్వా – కలైణర్ టివిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఆయనను ఇటీవలే సిబిఐ అరెస్ట్ చేసింది. టెలికాం మాజీమంత్రి రాజా నుంచి లబ్ది పొందిన వారిలో బల్వాకూడా ఒకరు. అయితే – తమ ఛానల్‍కు, ఈ కుంభకోణానికి సంబంధంలేదని కళిమొని అంటున్నారు. ‘గొప్పవారి గోత్రాలు ఎవరికెరుక’..!

Source: medianx.tv

No comments:

Post a Comment