Monday, February 28, 2011

మీడియా వారికి రైల్వే ఐడి కార్డులు

రైల్వేమంత్రి మమతాబెనర్జీ తన రైల్వే బడ్జెట్‍లో మీడియావారిని కొంత కరుణించారు. మీడియా పర్సన్స్ ఇక ఫొటో ఐడెంటిఫికేషన్ కమ్ క్రెడిట్ కార్డులను వినియోగించుకుని రైళ్లలో రాయితీపై ప్రయాణించవచ్చు. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో గానీ, సంబంధిత అధికారులు గానీ ఇచ్చే అనుమతి పత్రాల ఆధారంగా ఈ కార్డులు అందజేస్తారు. ఇప్పటివరకు మీడియావారు రాయితీల కోసం రైల్వేశాఖ నుంచి కూపన్లు పొందవలసివచ్చేది. అయితే ఇకపై వారు ఈ కార్డుల సౌకర్యం వినియోగించుకోవచ్చు. వీటి ఆధారంగా వారు రిజర్వేషన్ పొందుతారు, ఇప్పటి వరకు తమ భార్య లేదా తమ భర్తతో పాటు ప్రయాణించే వారికి ఇస్తున్న 30 శాతం రాయితీని 50 శాతానికి పెంచారు. ఏడాదిలో ఒక సారి ఈ సౌకర్యాన్ని వారు వినియోగించుకోవచ్చు.

Source: medianx.tv

No comments:

Post a Comment