Tuesday, February 15, 2011

ప్రేమకథలో ‘ట్విస్ట్’


చక్కటి జంటని చూస్తే - మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంతా అనుకునే మాట. ఐతే - ఆ కథ మలుపు తిరిగితేనో? ఠట్ - కథ అడ్డం తిరిగితేనో ఎలా ఉంటుంది? అంతా ‘రివర్స్ గేర్’. స్టార్ ప్లస్‌లో ధారావాహికంగా ప్రసారమవుతున్న ‘ప్యార్ మే ట్విస్ట్’లో సరిగ్గా ఇదే జరుగుతోంది. అమోల్ - రేఖ అటువంటి జంటే. అమోల్‌గా మనీష్ పాల్.. రేఖగా రోషిణి చోప్రా నటిస్తున్నారు. ఇక ఈ కథలో భర్త ఎడ్డెం అంటే పెళ్లాం తెడ్డెం అంటుంది. ఫలానా పని ఎందుకు చక్కబెట్టలేదూ అంటే.. చెప్పేబదులు చేసేయ్యొచ్చుగా అంటూ దీర్ఘాలు తీస్తుంది. ఆ భర్త కూడా ‘పెళ్లాం చెబితే’నే కాదు - ఎవరు చెప్పినా వినడు. ఇదంతా కామెడీ ట్రాక్‌లో చెబుతూ - సందర్భానుసారంగా ఛలోక్తుల్ని విసురుతూన్న ఈ సీరియల్ జనాన్ని ఆకట్టుకోవటమే కాదు.. ఎవరి జీవితంలోనూ ఇలాంటి సందర్భాలు ఉండకూడదని భావిస్తున్నార్ట కూడా. ఈ సీరియల్‌ని చూస్తూంటే అచ్చంగా గతంలో అమోల్ పాలేకార్ సినిమా చూస్తున్నట్టుగా ఉందిట. ‘ప్యార్’లో ఆ మాత్రం ‘ట్విస్ట్’లు లేకుంటే ఎట్లా?

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment